న్యూయార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం.. రెండు వారాల్లో ఇది రెండో ఘటన..
భారతీయులు జాతిపితగా కొలుస్తూ, ఎంతో అభిమానించే మహాత్మాగాంధీ విగ్రహం అమెరికాలో ధ్వంసం అయ్యింది. న్యూయార్క్ సిటీలోని ఓ ఆలయం ముందు ఉన్న విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
న్యూయార్క్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం అయ్యింది. ఓ ఆలయం ముందు ఉన్న విగ్రహాన్ని కూల్చేశారు. ఈ ఘటన ఆగస్టు 16వ తేదీన తెల్లవారుజామున జరిగింది. అయితే అమెరికాలో గాంధీ విగ్రహంపై దాడి జరగడం రెండు వారాల్లో ఇది రెండో సారి.
ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్నా.. పరీక్ష కూడా రాశాను. కానీ... - రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
పోలీసులు మీడియాతో తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ తులసి మందిర్ వద్ద ఉన్న విగ్రహాన్ని ఆరుగురు వ్యక్తులు ఒక సుత్తితో ధ్వంసం చేశారు. దాని చుట్టూ మరియు రహదారిపై ద్వేషపూరిత పదాలను రాశారు. దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న 25 నుంచి 30 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల వీడియోను కూడా పోలీసులు విడుదల చేశారు.
రేపిస్టుల విడుదలపై న్యాయవ్యవస్థను తప్పుపట్టడం సరికాదు.. ఆ జడ్జీ ఏమన్నాడంటే?
నిందితులు తెల్లటి మెర్సిడెస్ బెంజ్, ముదురు రంగు కారులో ఘటన స్థలం నుండి పారిపోయినట్టు కనిపిస్తోంది. ఇది రెంట్ కారుగా ఉపయోగించే టయోటా క్యామ్రీ కావచ్చునని పోలీసులు తెలిపారు. అయితే అంతకుముందు ఆగస్టు 3వ తేదీన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి కూల్చివేసినట్లు కూడా నివేదికలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా తాజా ఘటనను న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్కుమార్ ఖండించారు. ‘‘ నేరస్థులను త్వరితగతిన పట్టుకోవాలి. వారిపై కేసులు పెట్టాలి. చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. క్వీన్స్, దేశం, ప్రపంచం చుట్టూ ఉన్న పీపీఎల్ నుంచి నాకు లభించిన మద్దతుతో ఈ ద్వేషపూరిత శక్తులను ఓడించడంలో మేము విజయం సాధిస్తామని నేను గతంలో కంటే ఎక్కువ ఆశాజనకంగా ఉన్నాను. ’’ అని పేర్కొన్నారు.
కాగా.. ఈ ఏడాది జులై 14వ తేదీన కెనడాలో ఇదే తరహా ఘటన జరిగింది. అక్కడ ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో NYCలోని మాన్హట్టన్లో కూడా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.