Asianet News TeluguAsianet News Telugu

LK Adavani Birth Day... రామజన్మ భూమి రథసారథికి మోడీ శుభాకాంక్షలు

"గౌరవనీయమైన అద్వానీ జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను. ప్రజలను శక్తివంతం చేయడానికి, మన cultural pride పెంపొందించడానికి ఆయన చేసిన అనేక ప్రయత్నాలకు దేశం ఆయనకు రుణపడి ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు.

LK Advani turns 94, PM Narendra Modi, top BJP leaders extend birthday greetings to BJP stalwart
Author
Hyderabad, First Published Nov 8, 2021, 11:24 AM IST

న్యూఢిల్లీ : మాజీ ఉపప్రధాని, బీజేపీకి సుదీర్ఘకాలంపాటు రాష్ట్రపతిగా పనిచేసిన ఎల్‌కే అద్వానీ సోమవారంతో 94వ ఏట అడుగుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అనేక మంది ఇతర బిజెపి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. దేశానికి, పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

"గౌరవనీయమైన అద్వానీ జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సుదీర్ఘమైన,  ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను. ప్రజలను శక్తివంతం చేయడానికి, మన cultural pride పెంపొందించడానికి ఆయన చేసిన అనేక ప్రయత్నాలకు దేశం ఆయనకు రుణపడి ఉంటుంది. ఆయన పాండిత్య కార్యకలాపాలకు, గొప్ప మేధస్సు విషయంలో కూడా విస్తృతంగా గౌరవించబడ్డారు" అని ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు.

ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అద్వానీని స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శిగా కొనియాడారు. వారి పాండిత్యం, దూరదృష్టి, తెలివితేటలను అందరూ గుర్తించే అత్యంత గౌరవనీయమైన నాయకులలో LK Advani  పరిగణించబడతారని అన్నారు.

ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపీ సీనియర్ నేతకు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్వానీ దీర్ఘాయుష్సుతో, ఆరోగ్యంతో జీవించాలని కోరుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ మౌత్‌పీస్ అయిన ఆర్గనైజర్ వీక్లీ కూడా ఎల్‌కె అద్వానీకి 94వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. 80వ దశకం చివరిలో 
Rama janmabhoomi ఉద్యమంతో భాజపా తన అదృష్టాన్ని ముడిపెట్టి, ప్రధాన జాతీయ రాజకీయ పార్టీగా ఎదగడానికి ప్రధాన రూపశిల్పిగా అద్వానీ చేసిన కృషిని కొనియాడారు. 

దీంతో హిందూత్వ రాజకీయాలకు ఆకృతి ఇచ్చారు. దశాబ్దాల పాటు పార్టీని, దాని ముందున్న జనసంఘ్‌ను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి నడిపించారు. అవిభక్త భారతదేశంలోని కరాచీలో జన్మించిన ఎల్ కె అద్వానీ ఆర్‌ఎస్‌ఎస్‌లో, తరువాత జనసంఘ్ స్థాపించినప్పటి నుండి అందులో చేరాడు.

రైతు ఆందోళన.. వచ్చే ఎన్నికలు.. జమ్ము కశ్మీర్.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వీటిపై చర్చ

కాగా, గతంలో షికార అనే సినిమా చూస్తూ బిజెపి సీనియర్ నేత ఎల్ కె అద్వానీ ఉద్వేగానికి గురయ్యారు. ‘షికార : ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్’ అనే సినిమా హిందీలో నిర్మితమైంది. ఈ సినిమాను కాశ్మీరీ పండితులను కాశ్మీర్ నుంచి తరిమేసిన సంఘటనల ఆధారంగా నిర్మించారు. సినిమాకు విధు వినోద్ చోప్రా నిర్మించి దర్శకత్వం వహించారు. 

సినిమా పూర్తయ్యేసరికి ఎల్ కే అద్వానీ కన్నీటిని ఆపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న దృశ్యం, ఆయనను ఓదార్చడానికి చోప్రా ఆయన వద్దకు పరుగెత్తే దృశ్యం వీడియోలో రికార్డయింది. ఇతరులు కూడా ఉద్వేగానికి గురి కావడం, దర్శకుడిని అభినందించడం వీడియోలో రికార్డు అయింది.

1990 ప్రారంభంలో కాశ్మీరీ పండితులు తమ ఇళ్లను వదిలేసి బయటకు రావాల్సిన తీవ్ర పరిస్థితులను ఆధారం చేసుకుని ఆ సినిమాను నిర్మించారు. కాశ్మీరీ పండితులు ప్రమాదకరమైన పరిస్థితిని తట్టుకుని తమ జీవితాలను పునరుద్ధరించుకునే స్థితిని సినిమాలో చూపించినట్లు చోప్రా చెప్పారు. 

ఆదిల్ ఖాన్, సాదియా నటించిన షికార సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైంది. కాశ్మీర్ కు చెందిన విధు వినోద్ చోప్రా తన సినిమాను 2007లో మరణించిన తన తల్లికి అంకితం చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios