Asianet News TeluguAsianet News Telugu

నరబలికి ముందు రేప్.. భర్త కళ్లెదుటే భార్యపై షఫీ అత్యాచారం?

కేరళ నరబలి  ఘటన విషయాలు వెలుగులోకి వస్తున్నకొద్దీ మరీ దారుణమైన రూపం తీసుకుంటున్నది. ఇద్దరు మహిళల నరబలులకు ముందు ఓ రేప్ జరిగింది. నరబలిని మహమ్మద్ షఫీ, ఇద్దరు భార్యాభర్తలు కలిసి చేశారు. దీనికి ముందు ఆ భార్యతో భర్త అనుమతితో షఫీ రేప్ చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
 

kerala human sacrifice accused rape infront of husband by another accused muhammad shafi
Author
First Published Oct 12, 2022, 4:07 PM IST

తిరువనంతపురం: కేరళ నరబలి ఘటనతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ ఘటనలో విషయాలు మనిషి నాగరికతనే ప్రశ్నించేలా ఉన్నాయి. సిరి సంపదలు వస్తాయని నరబలికి దంపతులు అంగీకరించడం, మనిషి బాడీ పార్టులను ఉడికించుకుని తింటే యవ్వనులుగానే ఉంటారనే మాటలు విశ్వసించారంటే వారి ఆలోచన ప్రగతి ఎక్కడ గడ్డకట్టుకుపోయిందా? అనే అనుమానాలు వస్తున్నాయి. విషయాలు వెలుగులోకి వచ్చినకొద్దీ ఈ ఎపిసోడ్ మరింత క్రూరంగా కనిపిస్తున్నది. ఇద్దరు మహిళలను మూఢ నమ్మకాలతో అత్యంత దారుణంగా హతమార్చడమే కాదు.. అవే గుడ్డి నమ్మకాలతో సొంత భార్య పైనే అత్యాచారానికి భర్త అంగీకరించాడు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఫేస్‌బుక్ ద్వారా కుట్ర పన్ని మహమ్మద్ షఫీ అనే దుర్మార్గుడు భగవాల్ సింగ్‌కు మాంత్రికుడిగా పరిచయం అయ్యాడు. తన ఆర్థిక నష్టాలు, అప్పుల గురించి చెప్పి.. వాటికి పరిష్కారం కావాలని కోరాడు. దీనికి నరబలి అవసరం అని ఉన్మాదుడైన షఫీ సూచించాడు. ఆడవాళ్లపై తీవ్ర కామేచ్ఛతో రగిలే షఫీ ఇందుకు ఓ కండీషన్ పెట్టాడు. ఈ నరబలి అనే ఘట్టం చేపట్టడానికి ముందు భగవాల్ సింగ్ భార్యతో తాను సంగమించాలని, అది ఈ నరబలిలో భాగం అని వివరించాడు. ఈ దుష్ట నిర్ణయానికి భగవాల్ సింగ్ అంగీకరించాడు.

Also Read: కేరళ నరబలి కేసు: ఇద్దరు మహిళలను ఏ విధంగా బలి ఇచ్చారు? ఎందుకు చేశారు?

భగవాల్ సమక్షంలోనే ఆయన భార్య లైలాపై మహమ్మద్ షఫీ లైంగికదాడి చేశాడు. ఈ దారుణానికి భర్త అంగీకరించాడు. భార్య లైలా అయిష్టంగానైనా ఆమోదించక తప్పలేదు. అత్యాచారం జరిగిందా, లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు.

ఆ తర్వాత తమకు ఎలాగైనా సంపద రావాలని, అందుకోసం ఎక్కువ మొత్తంలోనైనా డబ్బు చెల్లించడానికి సిద్ధం అని భగవాల్ ఆ షఫీకి చెప్పాడు. దీన్ని షఫీ ఆసరాగా తీసుకుని మరో కుట్రకు తెరలేపాడు. మూఢ నమ్మకాలపై వారి విశ్వాసాన్ని తాను సొమ్ము చేసుకోవడానికి ప్లాన్ వేశాడు.

Also Read: నరబలి కేసులో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు.. ముక్కలుగా నరికి.. శరీరలను ఉడికించుకుని తిన్న నిందితులు

నరబలి ఇవ్వాలని, అందుకు తానే మనిషిని తెస్తా అని చెప్పాడు. భగవాల్ సింగ్, లైలాలను మోసం చేయడానికి మహిళలతో డీల్ కోసం షఫీ మాట్లాడటం మొదలు పెట్టాడు.ఈ క్రమంలోనే రొస్లిన్, పద్మలను తెచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios