మణిపూర్ లోనూ బీజేపీతో జేడీ(యూ) తెగదింపులు ? బీరేన్ సింగ్ ప్రభుత్వానికి ఎఫెక్ట్ ?
బీహార్ లో బీజేపీతో విడిపోయినట్టుగానే మణిపూర్ లోనూ ఆ పార్టీతో తెగదింపులు చేసుకోవాలని జేడీ(యూ) ప్లాన్ చేస్తోంది. ఈ విషయంలో త్వరలో నిర్వహించే ఆ పార్టీ జాతీయ కార్యవర్గం, జాతీయ మండలి సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎతో నితీష్ కుమార్ కు చెందిన జేడీ(యూ) ఇటీవల తన బంధాన్ని తెంచుకుంది. ఆర్జేడీ, వామపక్షాలు, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాలు చోటు చేసుకున్న కొన్ని వారాల తరువాత జేడీ(యూ) మణిపూర్ లో కూడా ఇలాంటి అడుగే వేయనుందని తెలుస్తోంది. మణిపూర్ గవర్నమెంట్ లో భాగంగా ఉన్న ఆ పార్టీ దాని నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్టు సమాచారం.
జార్ఖండ్ లో రిసార్ట్ రాజకీయాలు షురూ.. రాయ్పూర్కు వెళ్లిన యూపీఏ ఎమ్మెల్యేలు..
జేడీ(యూ) ప్రస్తుతం ఎన్ బీరెన్ సింగ్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతును అందిస్తోంది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నెల మొదట్లోనే ఎన్నికల సంఘం మణిపూర్లో జేడీ (యూ)ని రాష్ట్ర పార్టీగా గుర్తించింది. 60 మంది సభ్యుల అసెంబ్లీలో 55 సీట్లను కలిగి ఉన్న బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణానికి వీరి మద్దతు ఉంది. అయితే ఈ కూటమి నుంచి జేడీయూ వైదొలగిన రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదు. అధికార కూటమి నుంచి ఆ పార్టీ తెగదింపులు చేసుకున్నా మెజారిటీ మార్కు 31 కంటే ప్రభుత్వానికి ఎక్కువగానే ఎమ్మెల్యేలు ఉంటారు.
భారత నావికాదళానికి కొత్త జెండా.. కొచ్చిలో ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
నితీష్ కుమార్ బీహార్ లో ఎన్డీఏతో బంధాన్ని తెంచుకున్నప్పటికీ ఆ పార్టీ ఇప్పటివరకు మణిపూర్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా అరుణాచల్ ప్రదేశ్లోని ఏకైక జేడీ(యూ) ఎమ్మెల్యే ఇటీవలే బీజేపీలో చేరారు. కాగా మణిపూర్ విషయంలో ఎలాంటి ముందడుగు వేయాలనే విషయం సెప్టెంబర్ 3-4 తేదీల్లో పాట్నాలో జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది.
JD(U) తన జాతీయ కార్యవర్గం, జాతీయ మండలి సమావేశాలను వరుసగా సెప్టెంబర్ 3, 4 తేదీల్లో పాట్నాలో నిర్వహించనుంది. ఇవి ఆ పార్టీ రెండు ముఖ్యమైన సంస్థాగత సంస్థలు. బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ కూటమితో చేతులు కలిపిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కుమార్ తీసుకున్న ఈ స్టెప్ విపక్షాల శిబిరంలో కొంత శక్తిని నింపింది 2024 లోక్సభ ఎన్నికలలో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండొచ్చనే ఊహాగానాలకు దారితీసింది.