చంద్రయాన్-2లో కీలక ఘట్టం: ఆర్బిటర్ నుండి విడిపోయిన ల్యాండర్
చంద్రయాన్ -2 లో కీలక ఘట్టం చ ోటు చేసుకొంది. ఆర్బిటర్ నుండి ల్యాండర్ విడిపోయింది.
నెల్లూరు:చంద్రయాన్-2 లో కీలక ఘట్టం సోమవారం నాడు చోటు చేసుకొంది. ఆర్బిటర్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. చంద్రయాన్-2లో తాము అనుకొన్నట్టుగానే అన్ని జరగడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరపడుతున్నారు.
ఈ ఏడాది జూలూై 22వ తేదీన శ్రీహరి కోట నుండి చంద్రయాన్-2 ప్రయోగించారు. ఆర్బిటర్ నుండి విడిపోవడంతో జాబిల్లికి అత్యంత సమీపంలోకి విక్రమ్ ల్యాండర్ వెళ్లనుంది.ఈ నెల 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. ప్రస్తుతం చంద్రుడికి అత్యంత సమీపంలోకి విక్రమ్ ల్యాండర్ చేరుకొంది.
తాము ఊహించినట్టుగానే చంద్రయాన్-2 ప్రయోగం సాగుతుండడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూమితో పాటు చంద్రుడిపై ఉన్న పరిస్థితులపై ఫోటోలను చంద్రయాన్-2 విడుదల చేసింది.
సంబంధిత వార్తలు
మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2
మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2
చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్