Indian Policy On Dalai Lama:"దలైలామా మా అతిథి.." చైనాకు ధీటుగా సమాధానమిచ్చిన భారత్
Indian Policy On Dalai Lama: బౌద్ద మత గురువు దలైలామా 87వ జన్మ దిన వేడుకులు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. ఈ విషయాన్ని చైనా తప్పుబట్టింది. చైనా విమర్శలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధీటుగా సమధానమిచ్చింది.
Indian Policy On Dalai Lama: టిబెట్కు చెందిన బౌద్ధ గురువు దలైలామాకు ప్రధాని మోడీ జన్మ దిన శుభాకాంక్షలు చెప్పడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కూడా చైనాకు దీటైన సమాధానమిచ్చింది. దలైలామా భారత దేశానికి అతిథి అని, ఆయనను తాము ఎంతో గౌరవిస్తామని స్ఫష్టం చేసింది.
ప్రధాని మోదీపై చైనా విమర్శలు
టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా 87వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపినందుకు చైనా విమర్శించింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ సంబంధిత సమస్యలను ఉపయోగించడం మానేయాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ స్పందిస్తూ.. “14వ దలైలామా చైనా వ్యతిరేక వేర్పాటువాద స్వభావాన్ని భారతదేశం పూర్తిగా గుర్తించాలి. చైనా పట్ల నిబద్ధతకు కట్టుబడి ఉండాలి, తెలివిగా మాట్లాడండి, వ్యవహరించండి. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ సంబంధిత సమస్యలను ఉపయోగించడం మానేయండి. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో US విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా దలైలామాకు శుభాక్షాంక్షలు తెలిపారు. దీంతో అమెరికా పై కూడా జావో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చైనాకు పరోక్షంగా తగిన సమాధానం ఇచ్చారు. బౌద్ద గురువు దలైలామా మా దేశ అతిథి, ఆయనను గౌరవించాలనేది మా ప్రభుత్వ విధానమని బాగ్చి దీటుగా సమాధానమిచ్చారు. ఆయనకు భారత దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారనీ, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా దలైలామా పుట్టినరోజు జరుపుకుంటారని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గత సంవత్సరం దలైలామాతో మాట్లాడి ఆయనకు పుట్టినరోజును శుభాకాంక్షలు తెలిపారని అన్నారు.
సరిహద్దు వివాదాన్ని త్వరగా పరిష్కరించాలి: భారత్
భారత్-చైనా విదేశాంగ మంత్రుల చర్చలపై MEA అధికార ప్రతినిధి బాగ్చి మాట్లాడుతూ.. తూర్పు లడఖ్లోని సరిహద్దు వివాదం, సంఘర్షణ ప్రాంతాలలో పరిస్థితులపై ఉన్న అన్ని సమస్యలను త్వరగా పరిష్కరించడం గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారని, పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారని చెప్పారు.
అక్కడ శాంతిని నెలకోల్పడానికి.. సైన్యాన్ని పూర్తిగా తొలగించాలని పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక చర్యల ప్రాముఖ్యతను విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారని బాగ్చి చెప్పారు. రెండు దేశాల సీనియర్ కమాండర్లను వీలైనంత త్వరగా కలుసుకోవడానికి తాను ఎదురుచూస్తున్నానని అన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ నుండి కూడా సమాచారం కోరడం గమనించదగ్గ విషయం. ఇటీవల, జమ్మూ కాశ్మీర్లో శిఖరాగ్ర సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వచ్చిన నివేదికలపై చైనా, పాకిస్తాన్ రెండూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అటువంటి పరిస్థితిలో.. నిపుణులను విశ్వసిస్తే.. ఈ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం లడఖ్, జమ్మూ కాశ్మీర్లో జరిగితే, దానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. జి-20 కింద పలు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.