శత్రువులతో వీరోచితంగా పోరాడిన ఇండియన్ ఆర్మీ డాగ్ ‘జూమ్’ ఇక లేదు..
ఉగ్రవాదులతో భీకరంగా పోరాడి గాయపడిన ఇండియన్ ఆర్మీ డాగ్ జూమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయింది. శత్రువులను మట్టుబెట్టేందుకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ లో పాల్గొన్న జూమ్ కు రెండు బుల్లెట్లు తగిలాయి.
ఇండియన్ ఆర్మీలో భయంకరమైన అసాల్ట్ కుక్క “జూమ్” గాయాలతో పోరాడి గురువారం ఓడిపోయింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో శరీరంపై రెండు బుల్లెట్లు దిగినా.. దానిని లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడింది. వెంటనే డాక్టర్లు దానిని సోమవారం శ్రీనగర్లోని ఆర్మ్డ్ ఫోర్స్ వెటర్నరీ హాస్పిటల్లో చేర్చారు. ఆ సమయంలో దాని ముఖం, వెనుక కుడి కాలుపై తుపాకీ గాయం ఉండటంతో ఆపరేషన్ చేశారు. అయితే అందరూ జూమ్ కోలుకుని తిరిగి వస్తుందని అనుకున్నారు. కానీ ఆ శునకం తుది శ్వాస విడిచింది.
ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట.. నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు...వెంటనే విడుదలకు ఆదేశాలు..
మ్ మరణంపై శ్రీనగర్ కు చెందిన ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. “54 ఆర్మ్డ్ ఫోర్స్ వెటర్నరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మా ఆర్మీ డాగ్ జూమ్ మధ్యాహ్నం 12 గంటలకు మరణించింది. 11.45 వరకు అది బాగానే కనిపించింది. ఆరోగ్యం మెరుగుపడుతోంది, బాగా ప్రతిస్పందిస్తోంది అని అనుకుంటున్న సమయంలో జూమ్ ఒక్క సారిగా ఊపిరి పీల్చుకోవడం ఆపేసింది. వెంటనే కుప్పకూలింది. ’’ అని అన్నారు.
భారత సైన్యం తన కుక్క మృతికి సంతాపం తెలిపింది. నార్తర్న్ కమాండ్ ఓ ట్వీట్ లో.. “ఆర్మీ కమాండర్ నార్తర్న్ కమాండ్ అసాల్ట్ డాగ్ 'జూమ్' మృతికి సంతాపం తెలుపుతోంది. టాంగ్పావా అననాత్నాగ్లో విధి నిర్వహణలో గాయపడిన జూమ్ చివరకు అక్టోబర్ 13న తుది శ్వాస విడిచింది. అది దేశానికి సేవ చేసిన నిజమైన హీరో.’’ అని పేర్కొంది.
ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై దాడి, పరిస్థితి విషమం.. రేస్ అటాక్ అంటున్న తల్లిదండ్రులు..
జూమ్ బెల్జియన్ షెపర్డ్ సెప్టెంబరు 2020లో జన్మించింది. ఆర్మీ కు చెందిన 28 ఆర్మీ డాగ్ యూనిట్లో చేరాడు. అక్కడ ఎనిమిది నెలల పాటు సేవలు అందించింది. ఆర్మీకి 32 యూనిట్లు ఉన్నాయి, వాటిలో 19 డాగ్ యూనిట్లు నార్తర్న్ కమాండ్లో పనిచేస్తున్నాయి. ఒక్కో కుక్కల యూనిట్లో వివిధ ప్రత్యేకతలు కలిగిన 24 కుక్కలు ఉంటాయి.
మీరట్లోని రీమౌంట్ వెటర్నరీ కాలేజీలో ఉన్న డాగ్ ట్రైనింగ్ ఫెసిలిటీలో ఆర్మీ డాగ్లు శిక్షణ పొందుతాయి. కుక్కలకు విధేయత, దాడి, పెట్రోలింగ్, గార్డింగ్, ట్రాకింగ్, హిమపాతం రెస్క్యూ ఆపరేషన్, స్నిఫింగ్ (పేలుడు మరియు గనిని గుర్తించడం) వంటి ప్రత్యేక పనులలో అధునాతన శిక్షణ ఇస్తారు.
జూమ్ ఎలా గాయపడిందంటే ?
దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారంతో భద్రతా దళాలు ఆదివారం అర్థరాత్రి కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిలోకి సైన్యం జూమ్ ను పంపించింది. అందులో దాక్కున్న ఉగ్రవాదులను క్లియర్ చేసే పనిని ఆ ఆర్మీ డాగ్ కు ఎప్పటిలాగే అందించారు.
స్నేహితుడి ఇంటికి వచ్చి, అతని రెండేళ్ల కూతురిపై కన్నేసి.. అపహరించి, అత్యాచారం..
అది తన విధులు నిర్వహిస్తున్న సమయంలో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో టెర్రరిస్టులను గుర్తించిన జూమ్, వారిపై దాడి చేసింది. దీంతో ఈ సమయంలో ఆ కుక్కకు రెండు బుల్లెట్లు తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. అయినప్పటికీ జూమ్ పోరాడుతూనే ఉంది. తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఆ జూమ్ చేసిన పని వల్ల ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ సమయంలో మన సైనికులకు ఆ ఆర్మీ డాగ్ ఎంతో సహాయం చేసింది. తరువాత దానిని హాస్పిటల్ లో చేర్చారు.