భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Budget 2024: గడచిన 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా పరివర్తన చెందిందని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలకు ముందు సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
![India Budget 2024-25: India is emerging as a global power.. Finance Minister Nirmala Sitharaman's comments in budget speech RMA India Budget 2024-25: India is emerging as a global power.. Finance Minister Nirmala Sitharaman's comments in budget speech RMA](https://static-ai.asianetnews.com/images/01hmzy6ze12ckd652vgx22ywcq/budget-2024-four-income-tax-benefits-you-would-expect-from-fm-nirmala-sitharaman_363x203xt.jpg)
India Budget 2024-25: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు సాధించిన విజయాలను గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల ఏడాది కావడంతో మధ్యంతర బడ్జెట్ అయిన్పటికీ ఈ బడ్జెట్ పై మరింత ఆసక్తి పెరిగింది. దీనికి తోడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇదే తొలి మధ్యంతర బడ్జెట్ కావడం విశేషం. లోక్ సభ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉండటంతో ఆర్థిక మంత్రి కూడా ఈ బడ్జెట్ లో పలు భారీ ప్రజాకర్షక ప్రకటనలు చేస్తున్నారు. గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా సానుకూల మార్పును చూసిందని నిర్మలా సీతారామన్ గురువారం అన్నారు.
సాంకేతికంగా ఓట్ ఆన్ అకౌంట్ గా, మధ్యంతర బడ్జెట్ గా పిలువబడే ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారత ప్రజలు భవిష్యత్తు కోసం ఆశలు, అవకాశాలతో ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని అంశాలను అందిపుచ్చుకుంటున్నదని చెప్పారు. నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రజాకర్షక కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో గణనీయమైన మార్పును చూసిందనీ, ప్రభుత్వం నిర్మాణాత్మకమైన అనేక ప్రజా అనుకూల సంస్కరణలను తీసుకుందని తెలిపారు.
LPG price hike: బడ్జెట్ రోజున షాక్..పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
'2014లో దేశం అపారమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆ సవాళ్లను అధిగమించి నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టింది. ప్రజా అనుకూల సంస్కరణలు చేపట్టింది. ఉద్యోగాలు, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కు పరిస్థితులు ఏర్పడ్డాయి. అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరడం ప్రారంభమైంది. దేశానికి కొత్త లక్ష్యం, ఆశలు మొదలయ్యాయి' అని నిర్మలా సీతారామన్ తన ఎన్నికల ముందు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రెండో టర్మ్ లో ప్రభుత్వం తన మంత్రాన్ని బలోపేతం చేసిందనీ, సామాజిక, భౌగోళిక అంశాలన్నింటినీ తమ అభివృద్ధి తత్వం కవర్ చేసిందన్నారు. దేశం మొత్తం విధానంతో, కోవిడ్ -19 మహమ్మారి సవాళ్లను అధిగమించింది, ఆత్మనిర్భర్ భారత్ వైపు సుదీర్ఘ అడుగులు వేసింది. అమృత్ కాలం వైపు బలమైన పునాదులు వేసిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
బడ్జెట్ గురించి మీకు తెలియని టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవి