అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం (ayodhya pran pratishtha celebrations) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu letter to Prime Minister Narendra Modi) రాసిన రెండు రోజుల కిందట లేఖ రాశారు. అయితే దానికి ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా (PM Modi's letter to President's letter) బదులిచ్చారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు.

అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లాకు ప్రతిష్ఠాపన చేయడం తన జీవితంలో మరపురాని ఘట్టాలలో ఒకటని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇది తన నుంచి ఎప్పటికీ పోదని తెలిపారు. తన హృదయంలో ఒక అయోధ్యతో తిరిగి వచ్చానని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన రెండు పేజీల లేఖలో ప్రధాని మోడీ ఈ విషయాలను వెల్లడించారు. ఈ లేఖను తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో షేర్ చేశారు. రెండు రోజుల క్రితం రాష్ట్రపతి నుంచి తనకు చాలా స్ఫూర్తిదాయకమైన లేఖ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తాను కూడా ఒక లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రయత్నించానని చెప్పారు. 

‘మోడీ అక్కడ ఓ ఫంక్షన్ చేశారు’- రామమందిర ప్రతిష్ఠాపనపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

ఆ లేఖలో ఏముందంటే..
“నా జీవితంలో మరచిపోలేని క్షణాలను చూసిన తర్వాత అయోధ్య ధామ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నేను మీకు ఈ లేఖ రాస్తున్నాను. నేను కూడా నా హృదయంలో అయోధ్యతో తిరిగి వచ్చాను. నా నుండి ఎప్పటికీ పోలేని అయోధ్య.'' అని ప్రధాని మోడీ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి శుభాకాంక్షలకు, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని, లేఖలోని ప్రతి పదంలోనూ ఆయన తన కరుణామయ స్వభావాన్ని, దీక్షను నిర్వహించడం పట్ల ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Scroll to load tweet…

తనకు ఈ లేఖ అందిన సమయంలో తాను భిన్నమైన 'భావ యాత్ర'లో ఉన్నానని, ఈ లేఖ తన భావోద్వేగాలను పరిష్కరించడంలో, పునరుద్దరించడంలో తనకు అపారమైన మద్దతు, శక్తిని ఇచ్చిందని మోడీ అన్నారు. “నేను యాత్రికుడిగా అయోధ్య ధామ్‌ని సందర్శించాను. అలాంటి విశ్వాసం, చరిత్ర సంగమం జరిగిన పుణ్యభూమిని సందర్శించిన తరువాత నా హృదయం అనేక భావోద్వేగాలతో ఉప్పొంగిపోయింది.’’ అని ప్రధాని పేర్కొన్నారు.

Scroll to load tweet…

ఈ లేఖలో తన 11 రోజుల ఉపవాసం, దానితో సంబంధం ఉన్న యమ-నియమ్‌ల గురించి ప్రధాని ప్రస్తావించారు. “శతాబ్దాలుగా రాముని కోసం వివిధ తీర్మానాలను పాటించిన లెక్కలేనన్ని మందికి మన దేశం సాక్షి. ఈ శతాబ్దాల సుదీర్ఘ ఉపవాసాలను పూర్తి చేయడానికి కండక్టర్ గా ఉండటం నాకు చాలా ఉద్వేగభరితమైన క్షణం. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు. 

అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరు.. ఇక నుంచి ఆ పేరుతోనే దర్శనం

‘‘140 కోట్ల మంది దేశప్రజలతో, రామ్ లల్లాను ప్రత్యక్షంగా చూసి, ఆయన రూపంలో కలుసుకుని, స్వాగతం పలికిన ఆ క్షణం సాటిలేనిది. శ్రీరాముడు, భారతదేశ ప్రజల ఆశీస్సులతోనే ఆ క్షణం సాధ్యమైంది. దీనికి నేను కృతజ్ఞుడను.’’ అని ప్రధాని మోడీ తెలిపారు. రాముడి ఆదర్శాలు భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని, ఆయన శక్తి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.