Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. టాయిలెట్ కు వెళ్లిన మానసిక వికలాంగ బాలికపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్

ముంబాయిలో దారుణం వెలుగులోకి వచ్చింది. టాయిలెట్ కు వెళ్లిన మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, జువైనల్ హోంకు తరలించారు. 

Horrible.. Gang rape of a mentally challenged girl who went to the toilet.. Video was taken and uploaded on social media.
Author
First Published Jan 21, 2023, 2:59 PM IST

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. టాయిలెట్ కు వెళ్లిన ఓ మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి, దానిని సోసల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఘటన బయటకు వచ్చింది. మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓ మైనర్ బాలిక నివసిస్తోంది. ఆమెకు మానసిక పరిపక్వత సరిగా లేదు. ఇటీవల ఆమె స్థానిక పరిసరాల్లో ఉన్న ఓ టాయిలెట్ లోకి వెళ్లింది. దీనిని గమనించిన ముగ్గురు మైనర్ బాలురు ఆమె వెళ్లిన టాయిలెట్ లోకి చొరబడ్డారు. బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను నిందితులు తమ మొబైల్స్ లో వీడియో కూడా తీశారు. అనంతరం బాలిక ఇంటికి చేరుకుంది.

ఈ వీడియోను నిందితులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో స్థానికంగా వైరల్ గా మారింది. దీనిని బాధితురాలి సోదరుడు చూశాడు. అతడు కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఘట్‌కోపర్‌ పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మైనర్లను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని జువైనల్‌ హోంకు తరలించారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

యూపీలోనూ గురువారం ఇలాంటి ఘటనే జరిగింది. దేవరనియా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 14 ఏళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నివసించే ఇంటికి సమీపంలో నివసించే 46 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి చొరబడి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే మైనర్ కుటుంబం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తనపై జరిగిన లైంగిక దాడిని బాలిక వారికి వివరించింది. దీంతో బాలిక తల్లి ఆగ్రహంతో నిందితుడి ఇంటికి వెళ్లింది. అతడిని నిలిదీసింది. కానీ నిందితుడి కుటుంబం ఆమెపై కర్రలతో దాడి చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. కానీ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని బాలికను వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. తదుపరి విచారణ జరిపి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ ఇంద్ర కుమార్ తెలిపారు

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో సొమవారం ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గిరిజన వర్గానికి చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు ఆదివారం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి వివరించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios