బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రెవణ్ణను హాసన్ జిల్లాలోని హొళెనరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన అత్యాచార కేసులో దోషిగా నిర్ధారించింది.
బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రెవణ్ణను హాసన్ జిల్లాలోని హొళెనరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన అత్యాచార కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ కేసు విచారణ జూలై 18న ముగిసింది.
హాసన్లోని కుటుంబానికి చెందిన గణ్ణికెర ఫామ్హౌస్లో పనిచేస్తున్న 48 ఏళ్ల మహిళపై రెండుసార్లు అత్యాచారం జరిగిందని ఆరోపించారు. ఒకసారి ఫామ్హౌస్లో, ఆపై 2021లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో బెంగళూరులోని బసవనగుడిలోని తన ఇంట్లో జరిగిందని, ఈ ఘటనను నిందితుడు తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడని ఆరోపించారు. విచారణ చేపట్టిన న్యాయ స్థానం తాజాగా ప్రజ్వల్ ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది.
Scroll to load tweet…
