Asianet News TeluguAsianet News Telugu

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి.. ఛార్జీ ఎంతో తెలుసా

కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం 64 విమానాలు రెడీ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 13 వరకు విమాన సర్వీసులను సిద్ధం చేసింది.

Flight charges for indians stranded in abroad
Author
New Delhi, First Published May 5, 2020, 7:15 PM IST

కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం 64 విమానాలు రెడీ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 13 వరకు విమాన సర్వీసులను సిద్ధం చేసింది.

అమెరికా నుంచి ఏడు, బ్రిటన్ నుంచి ఏడు విమానాల ద్వారా భారతీయులను తరలిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రయాణ ఖర్చుల ఛార్ట్‌ను భారత ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 64 విమానాల్లో విదేశాల్లో ఉన్న 14,800 మంది ఇండియాకు

బ్రిటన్ నుంచి ఢిల్లీ చేరేందుకు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే యూఎస్ అయితే ఈ చార్జీని లక్షగా నిర్ణయించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీ చేరేందుకు రూ.12 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

దేశంలో ఎక్కువ విమానాలను కేరళ నుంచి పంపనున్నారు. ఢిల్లీ-తమిళనాడు నుంచి 11 చొప్పున, మహారాష్ట్ర-తెలంగాణ నుంచి 7 చొప్పున, గుజరాత్ నుంచి 5, జమ్మూకాశ్మీర్, కర్ణాటక నుంచి 3, పంజాబ్-యూపీ నుంచి ఒక్కొక్కటి చొప్పున విమానాలు బయల్దేరనున్నాయి.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 600 కి.మీ. సైకిల్‌పైనే, అరటిపండ్లే ఆహారం

తొమ్మిది దేశాల నుంచి వచ్చే 11 విమానాలు తమిళనాడు చేరుకుంటాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు. మనిలా-చెన్నై, షికాగో-ఢిల్లీ, హైదరాబాద్-న్యూయార్క్-ఢిల్లీ-హైదరాబాద్, కువైట్-కోజికోడ్, శాన్ ఫ్రాన్సిస్కో-ఢిల్లీ-బెంగుళూరు రూట్లను పరిశీలిస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రతిరోజూ 2 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios