Asianet News TeluguAsianet News Telugu

పదే పదే చాక్లెట్లు, బొమ్మలు, బట్టలు అడుగుతోందని కూతురిని చంపిన తండ్రి.. ఇండోర్ లో ఘటన

పదే పదే కూతురు చాక్లెట్లు, బొమ్మలు అడుతోందని విసిగెత్తిపోయిన ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఆ బాలికను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. 

Father killed daughter for repeatedly asking her for chocolates, toys and clothes.. Incident in Indore..ISR
Author
First Published Jun 6, 2023, 11:37 AM IST

ఓ కన్నతండ్రి తన కూతురు పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. చాకెట్లు, బొమ్మలు కొనివ్వాలని డిమాండ్ చేస్తుండటంతో విసిగిపోయిన తండ్రి కూతురిని కడతేర్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది.

గుజరాత్ లో దారుణం.. క్రికెట్ బాల్ పట్టుకున్నాడని గొడవ.. దళిత యువకుడి బొటన వేలు నరికిన దుండగులు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లాలో 37 ఏళ్ల వ్యక్తి తన కూతురు, కూతురుతో కలిసి జీవిస్తున్నాడు. అతడి భార్య మూడు సంవత్సరాల కిందట కుటుంబాన్ని విడిచి ఎక్కడికో వెళ్లిపోయింది. తల్లి యాచక వృత్తి చేస్తూ జీవిస్తోంది. అయితే నిందితుడు మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో గత కొంత కాలం నుంచి కూతురు తన తండ్రిని చాకెట్లు, బొమ్మలు కొనివ్వాలని కోరుతోంది.

ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్.. ప్రమాదంపై 3 నెలల ముందే హెచ్చరించిన రైల్వే అధికారి..

కానీ డబ్బులు లేకపోవడంతో అతడు కూతురు కోసం వాటిని కొనుగోలు చేయలేకపోతున్నాడు. బాలిక పదే పదే తన తండ్రిని ఇదే విధంగా విసిగించడంతో అతడికి కోపం వచ్చింది. శనివారం రాత్రి తన కుమార్తెను తీసుకొని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి తీసుకొళ్లి హతమార్చాడు. అక్కడున్న టైల్స్ తో బాలిక తలపై పలుమార్లు కొట్టి, అతి కిరాతకంగా చంపేశాడు. 

రైల్వేలో తిరిగి విధుల్లోకి చేరిన రెజ్లర్లు.. ఆందోళనపై వెనక్కి తగ్గేది లేదంటూ వ్యాఖ్యలు

కాగా.. ఈ హత్య  విషయం బయటకు రావడంతో నిందితుడని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. తాను అత్యంత పేదరికంలో జీవిస్తున్నానని, కానీ తన కుమార్తె పదేపదే చాక్లెట్లు, బొమ్మలు, బట్టలు కొనివ్వాలని డిమాండ్ చేస్తోందని, అది తనను ఇబ్బంది పెట్టేదని నిందితుడు చెప్పాడు. ఈ సమస్య నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే బాలికను హతమార్చానని చెప్పాడు.

విద్యార్థినులపై నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు.. విజయవాడలో ఆందోళన చేపట్టిన బాలికలు

నిందితుడు మాదకద్రవ్యాలకు బానిస అని, డ్రగ్స్ మత్తులో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు వెల్లడించారు. అతడికి రేషన్ కార్డు కూడా లేదని అతడికి కేవలం ఓటరు ఐడీ కార్డు ఉందని, దానిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భార్య మూడు సంవత్సరాల కిందట కుటుంబాన్ని విడిచిపెట్టిందని, తల్లి యాచకురాలు అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios