పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్ నగరాల్లో గురువారం పేలుళ్లు సంభవించాయి. ప్రస్తుతం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పేలుళ్లు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి.

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ లో అలజడి మరింత పెరిగింది. అక్కడ వరుసగా ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా లాహోర్‌లో మిలటరీ యూనిట్‌పై డ్రోన్‌ దాడి జరిగింది... ఇందులో నలుగురు ఆర్మీ సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే ఈ డ్రోన్‌ దాడులు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ లేదంటే తాలిబన్లు చేసివుంటారని అనుమానిస్తున్నారు. చాలాకాలంగా పాక్ అంతర్యుద్ధంతో సతమతమవుతోంది పాక్... ఇప్పుడు భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది మరింత ముదిరింది. ఇదే అదునుగా తిరుగుబాటుదారులు వరస దాడులకు తెగబడుతున్నారు. అయితే ఈ దాడులను భారత్ పై నెట్టే ప్రయత్నం చేస్తోంది పాకిస్థాన్. 

లాహోర్ తో పాటు కరాచీలో వంటి ప్రధాన నగరాల్లో కూడా గురువారం పేలుళ్లు సంభవించాయి. ప్రస్తుతం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పేలుళ్లు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి.

Scroll to load tweet…

కరాచీలో మధ్యాహ్నం పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించాయని స్థానికులు తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయని అధికారిక మీడియా ధృవీకరించింది. పూర్తి వివరాలు తెలియకపోయినా, డ్రోన్ దాడి లేదా భద్రతా లోపం వల్ల ఈ పేలుళ్లు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

అంతకుముందు లాహోర్‌లోని వాల్టన్ రోడ్డు సైనిక విమానాశ్రయం సమీపంలో కనీసం రెండు శక్తివంతమైన పేలుళ్లు వినిపించాయి. పేలుళ్లకు కొద్దిసేపటి ముందు వాల్టన్ విమానాశ్రయం ప్రాంతంలో డ్రోన్ ఎగురుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

లాహోర్‌లోని అస్కారీ 5 ప్రాంతంలో మరో రెండు పేలుళ్లు సంభవించాయని కూడా వార్తలు వచ్చాయి. అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

భద్రతా దళాలు ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు, నిఘా కార్యకలాపాలు చేపట్టాయి. సోషల్ మీడియాలో పేలుళ్లకు సంబంధించిన వీడియోలు, వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిలో చాలా వరకు నిర్ధారించబడలేదు.

ఇటీవల భారతదేశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై జరిపిన సిందూర్ ఆపరేషన్ తర్వాత ఈ ప్రాంతంలో సైనిక, దౌత్యపరమైన ఘర్షణలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ పేలుళ్లు జరగడం గమనార్హం.