Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రదేశాలకు మాండరిన్, టిబెటన్ భాషలో చైనా పేర్లు మార్చింది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చాలన్న చైనా చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేస్తూ డ్రాగన్ కంట్రీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
China Renames 11 Places In Arunachal Pradesh: సరిహద్దులో మరోసారి చైనా తన కవ్వింపు చర్యలను క్రమంగా పెంచుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ను తమ దేశ భాగంగా చెప్పుకుంటున్న చైనా మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. అరుణాచల్ లోని 11 ప్రదేశాలకు పేర్లను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రదేశాలకు మాండరిన్, టిబెటన్ భాషలో చైనా పేర్లు మార్చింది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చాలన్న చైనా చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేస్తూ డ్రాగన్ కంట్రీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ ను చైనా గత కొన్ని నెలలుగా అరుణాచల్ ప్రదేశ్ ను తమ ప్రాంతంగా ప్రకటించుకుంటోంది. అలాగే, దానిని వారి దేశ పటంలోనూ చూపించుకుంటోంది. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ కు చైనీస్, టిబెటన్, పిన్యిన్ అక్షరాలలో మూడవ సెట్ పేర్లను చైనా విడుదల చేసింది. చైనా క్యాబినెట్ స్టేట్ కౌన్సిల్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలకు అనుగుణంగా అరుణాచల్ ప్రదేశ్ కు 11 ప్రాంతాల ప్రామాణిక పేర్లను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిందని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.
11 ప్రదేశాల అధికారిక పేర్లను మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసింది, ఇది రెండు భూ ప్రాంతాలు, రెండు నివాస ప్రాంతాలు, ఐదు పర్వత శిఖరాలు, రెండు నదులతో సహా ఖచ్చితమైన సమన్వయాలను ఇచ్చింది. అలాగే, ప్రదేశాల పేర్లు, వాటి క్రింది పరిపాలనా జిల్లాల కేటగిరీని జాబితా చేసిందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ సోమవారం నివేదించింది. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అరుణాచల్ ప్రదేశ్ ప్రామాణిక భౌగోళిక పేర్లలో ఇది మూడవ బ్యాచ్. అరుణాచల్ లోని ఆరు ప్రాంతాల ప్రామాణిక పేర్ల మొదటి బ్యాచ్ ను 2017లో, రెండో బ్యాచ్ 15 స్థానాలను 2021లో విడుదల చేసినట్టు తెలిపింది.
చైనాపై భారత్ ఫైర్..
చైనా తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డ్రాగన్ కంట్రీ తన కవ్వింపు చర్యలను మానుకోవాలని హితవుపలుకుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేస్తూ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చాలనే చైనా చర్యను భారత్ గతంలో తోసిపుచ్చిందనీ, ఆ రాష్ట్రం ఎల్లప్పుడూ.. ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందని భారత్ పేర్కొంది. కేవలం పేర్లను కేటాయించడం ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలలో మార్పులు చోటుచేసుకోవని చైనా తీరును ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రదేశాల పేర్లను మార్చడానికి చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఇదివరకు చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రదేశాలకు పేర్లు పెట్టడం వల్ల ఈ వాస్తవం మారదని ఆయన అన్నారు.
