India Pakistan Tensions: ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సన నాన్ గ్రాటాగా ప్రకటించింది. అతను తన అధికారిక హోదాకు తగని కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఈ చర్య తీసుకుంది. వెంటనే దేశం విడిచిపెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 

India Pakistan Tensions: ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సన నాన్ గ్రాటాగా ప్రకటించి 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. ఈషాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే ఈ అధికారి ఐఎస్ఐ గూఢచారి అనీ, దౌత్యవేషంలో గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలిసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్‌కు మంగళవారం అధికారికంగా ఈ విషయం తెలియజేసింది. భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసి, ఆ అధికారిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

“ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సన నాన్ గ్రాటాగా ప్రకటించింది. అతను తన అధికారిక హోదాకు తగని కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఈ చర్య తీసుకుంది. ఆ అధికారి 24 గంటల్లో భారతదేశం విడిచి వెళ్ళాలని ఆదేశించారు. ఈ మేరకు పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్‌కు మంగళవారం అధికారికంగా ఈ విషయం తెలియజేశారు” అని MEA విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కశ్మీర్ అంశం భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక అంశమని MEA పునరుద్ఘాటించింది.