ఆహారం కోసం పని చేయడం, తన జనాభాను పెంచడం జంతువులు కూాడా చేస్తాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మనిషి తెలివితో ఆలోచించాలని అన్నారు. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ మనుషులకు వర్తించదని తెలిపారు. 

జనాభా నియంత్రణపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ సాగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ విష‌యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్య‌లు చేర‌శారు. ‘బ్రీడింగ్ (పెంపకం)’ అనేది జంతువులు కూడా చేసే పని అని అన్నారు. జనాభా నియంత్రణ విధానాలకు తాను అనుకూలంగా ఉండవచ్చని సూచించిన భగవత్, జంతువుల మాదిరిగా కాకుండా మానవులలో దృఢమైన వ్యక్తి ఇతరుల మనుగడకు సహాయపడాలని అన్నారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలోని ముద్దెనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో 'శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్' తొలి స్నాతకోత్సవంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ ప్రసంగించారు.

మూడో భార్య, రెండు భార్య మధ్య సవతుల పోరు.. తల్లీ, కొడుకు సజీవదహనం..

‘‘ జంతువులు బతుకుతాయి. మనిషికి మెదడు లేకపోతే మనిషి ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన జంతువు. అయితే జంతువులు మాత్రమే ఆహారం కోసం పని చేస్తాయి. జనాభాను పెంచుతాయి. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అనేది జంతువులకు వర్తిస్తుంది, మానవులకు కాదు. మానవులలో ఫిట్టెస్ట్ ఒక వ్యక్తి మనుగడ సాగించడానికి ఇతరులకు సహాయం చేయాలి. మానవుడు, దానిని మెరుగైన ప్రపంచంగా మార్చడానికి మీ నైపుణ్యాలను ఉపయోగించాలి” అని భగవత్ అన్నారు. జాతీయత ప్రక్రియ వెంటనే ప్రారంభం కాలేదని మోహ‌న్ భ‌గ‌వ‌త్ అన్నారు. ఇది 1857 నుండి స్వామి వివేకానంద ద్వారా మొద‌లైంద‌ని అన్నారు. సృష్టి మూలాన్ని సైన్స్ ఇంకా అర్థం చేసుకోలేదని, ఆధ్యాత్మిక మార్గాల ద్వారా శ్రేష్ఠతను సాధించవచ్చని ఆయ‌న చెప్పారు. 
రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ నడుపుతోంది - యశ్వంత్ సిన్హా

అయితే మోహ‌న్ భగవత్‌ను వ్యాఖ్య‌ల‌ను మతపరమైన అంశంగా మార్చవద్దని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ అన్నారు. 2023 నాటికి చైనా జనాభాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని ఐక్యరాజ్యసమితి నివేదిక హైలైట్ చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. అయితే ఈ విష‌యంలో మొద‌ట‌గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.ర ‘ఒక వర్గం జనాభా పెరుగుదల వేగం.. ఇతరుల కంటే ఎక్కువగా ఉండటం జరగకూడదు’ అని అన్నారు. ‘‘ మనం అవగాహన కల్పించాలి. జనాభా సమతుల్యతను సాధించడానికి ప్రయత్నించాలి ’’ అని ఆయన ఇటీవల ఓ ప్ర‌సంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

22 ఏండ్లనాటి ఐటీ చట్టంలో అనేక లోపాలు.. సవరించాల్సిన సమయం వచ్చింది: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్

ఈ వ్యాఖ్య‌ల‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ప్రతిపక్ష నాయకులు మండిప‌డ్డారు. ఈ వాదనలు హిందువులు, ముస్లింలను విభజించే ఎత్తుగడగా పేర్కొన్నారు. ‘‘ సంఘీలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారు. నిజమే మోడీ పాలనలో భారతదేశ యువత, పిల్లలు అంధకార భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. భారతదేశంలోని యువతలో కనీసం సగం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు భారత్‌లోనే ఉన్నారు’’ అని ఒవైసీ ట్వీట్ చేశారు. ఇద్దరు పిల్లల విధానానికి తాను మద్దతివ్వబోనని, ఇది భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని కూడా ఆయన తెలిపారు.