Asianet News TeluguAsianet News Telugu

ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ నేతను చంపేసిన మావోయిస్టులు.. పోలింగ్‌కు మూడు రోజుల ముందే దారుణం

ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఓ బీజేపీ నేతను బహిరంగంగా గొడ్డలితో నరికి చంపారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందే ఎన్నికల కోసం క్యాంపెయిన్ చేస్తున్న బీజేపీ నేత రతన్ దూబేను హత్య చేశారు.
 

bjp leader killed by maoists in chhattisgarh ahead of polling kms
Author
First Published Nov 4, 2023, 9:57 PM IST

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులతో సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నందునే అసెంబ్లీ ఎన్నికలను రెండు విడుతలుగా నిర్వహిస్తున్నారు. తొలి విడత 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌కు మూడు రోజుల ముందే మావోయిస్టులు ఓ బీజేపీ నేతను చంపేశారు. బీజేపీ నారాయణ్ పూర్ జిల్లా యూనిట్‌ ఉపాధ్యక్షుడు రతన్ దూబే క్యాంపెయిన్ చేస్తుండగా మావోయిస్టులు గొడ్డలితో నరికి చంపేశారు. జిల్లాలోని కౌశల్నార్ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

రతన్ దూబే కౌశల్నార్ మార్కెట్ ఏరియాలో క్యాంపెయినింగ్ కోసం వెళ్లారు. అక్కడే మావోయిస్టులు గొడ్డలితో నరికి చంపేశారు. ఇటీవలే మావోయిస్టులు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎన్నికల్లో పాల్గొనరాదని వారు ఓ వార్నింగ్ ఇచ్చారు. ఓ పోలీసు బృందం స్పాట్‌కు చేరుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ హత్యను తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Also Read: ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ ప్రకటన?.. మరోసారి వర్గీకరణపై చర్చ

నవంబర్ 7వ, 17వ తేదీల్లో ఛత్తీస్‌గడ్‌లో రెండు విడుతలుగా పోలింగ్ జరుగుతున్నది. నారాయణ్ పూర్‌లో నవంబర్ 7వ తేదీనే పోలింగ్ జరగనుంది. సరిగ్గా పోలింగ్‌కు మూడు రోజుల ముందే మావోయిస్టులు ఈ హత్య చేయడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios