బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వానికి నేడు బలపరీక్ష..
బీహార్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం నేడు బల పరీక్షను ఎదుర్కోనుంది. ఎనిమిదో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ఈ సారి కూడా సునాయాసంగా బల నిరూపణ గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ నెల ప్రారంభంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) నుంచి వైదొలిగిన నితీశ్ కుమార్ ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎనిమిదోసారి సారి సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నుంచి డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. కాగా కొత్తగా ఏర్పాటు అయిన మహాకూటమికి అసెంబ్లీలో 164 మంది సభ్యుల మద్దతు ఉంది.
ఆగస్టు 24న ఫ్లోర్ టెస్ట్ నిర్వహించి, రాష్ట్ర అసెంబ్లీని సమావేశ పరిచేందుకు తగిన సిఫారసు చేయాలని కుమార్, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్లు హాజరైన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం చోటు చేసుకున్న వెంటనే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నుంచి సంఖ్యలో వ్యక్తులతో మంత్రివర్గాన్ని విస్తరించారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం నుంచి ఒకరు ఇండిపెండెంట్ కూడా మంత్రి వర్గంలో ఉన్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో సహా మహాకూటమిలోని ఆర్జేడీ, ఇతర పార్టీలతో చేతులు కలపడానికి ముందు నితీష్ కుమార్ ఆగస్టు 9న ఎనిమిదేళ్లలో రెండో సారి బీజేపీతో పొత్తును తెంచుకున్నారు. ఈ మహా కూటమికి హెచ్ఏఎం మద్దతు కూడా ఉంది. ఈ పార్టీకి అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
అయితే ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామాకు నిరాకరించారు. దీంతో కొత్త ప్రభుత్వం స్పీకర్ పై కూడా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. ఆర్జేడీ ఎమ్మెల్యే అవధ్ బిహారీ చౌదరి ఈ కూటమి నుంచి బీహార్ శాసనసభ స్పీకర్ గా వ్యవహరించనున్నారు.
‘‘ అవిశ్వాస తీర్మానం నాపై కాదు, చైర్పైనే విశ్వాసం లేకపోవడం వల్లనే పుట్టిందని నేను భావిస్తున్నాను. విధానసభ సెక్రటేరియట్లో స్వీకరించిన మోషన్ నోటీసు నియమాలు, నిబంధనలు, పార్లమెంటరీ నైటీలను తొలగించింది’’ అని విజయ్ కుమార్ సిన్హా మంగళవారం అన్నారు.
పాక్ భూభాగంలోకి.. బ్రహ్మోస్ క్షిపణి మిస్ఫైర్.. ముగ్గురు ఐఏఎఫ్ అధికారులపై వేటు
బీహార్ లో రాజకీయాల కొంత కాలం కిందట ఒక్క సారిగా మారిపోయాయి. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ తన పార్టీ అయిన జేడీ(యూ), బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏతో కలిసి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికి మెజారిటీ రావడంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఇటీవల బీజేపీకి, జేడీ(యూ)కి మధ్యన విభేదాలు వచ్చాయి. దీంతో నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగారు. ఆర్జేడీతో, కాంగ్రెస్, అలాగే ఇతర చిన్న పార్టీలో కూడిన మహాకూటమితో చేతులు కలిపారు. అయితే ఈ కూటమిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కొత్త ప్రభుత్వ కలయికపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. అయితే శివసేన పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాన్ని స్వాగతించింది.