ఆకాశంలో... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ఇండిగో ప్లైట్ గాల్లో వుండగానే ఓ మహిళ ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
న్యూడిల్లీ: నిండు గర్భంతో డిల్లీ నుండి బెంగళూరుకు వెళుతున్న ఓ మహిళ గాల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇండిగో ప్లైట్ గాల్లో వుండగానే బుధవారం సాయంత్రం 6:30 కి మహిళ ప్రసవించినట్లు అధికారులు తెలిపారు.
ఈ విషయం ఇండిగో సంస్థకు సంబంధించిన అధికారులు కూడా స్పందించారు. ''డిల్లీ నుండి బెంగళూరు బయలుదేరిన ఇండిగో6ఈ ఫ్లైట్ లో మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది'' అని అన్నారు.