అగ్నిపథ్ స్కీమ్ లోనే కొత్తగా కుల, మత ధృవీకరణ పత్రం అడగడం లేదని, ఇది గతం నుంచే కొనసాగుతున్న పద్దతి అని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నిపథ్ స్కీమ్ లో కొత్తగా ఏ మార్పు చేయలేదని తెలిపింది.
మిలిటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘అగ్నిపథ్’ కోసం ఇప్పుడు కొత్తగా కులం, మతం ధృవీకరణ పత్రాలు అడుగుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను భారత సైన్యం మంగళవారం తోసిపుచ్చింది. అభ్యర్థులు కుల, మత ధృవీకరణ పత్రం సమర్పించడం ఎప్పటి నుంచో ఉన్నాయని తెలిపింది. అగ్నిపథ్ లో స్కీం లో కొత్తగా ఈ విషయంలో ఏ మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.
MaharashtraPolitics: శివసేనలో మరో తిరుగుబాటు! రెబల్ నేతలకు వై కేటగిరీ భద్రత
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తో పాటు అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు అగ్నిపథ్ పథకాన్ని ప్రశ్నిస్తూ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకొని వ్యాఖ్యలు చేశారు. సంజయ్ సింగ్ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన ఆర్డర్ ను షేర్ చేస్తూ అగ్నిపథ్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కులం. మతం ధృవీకరణ పత్రాల అవసరంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సందించారు. ఇలా జరగడం భారతదేశ చరిత్రలో ఇది మొదటిసారి అని పేర్కొన్నారు.
‘‘ దళితులను, వెనుకబడిన, గిరిజనులను ఆర్మీ రిక్రూట్మెంట్కు అర్హులుగా మోదీ పరిగణించలేదా? భారతదేశ చరిత్రలో తొలిసారిగా ‘ఆర్మీ రిక్రూట్మెంట్’లో కులం అడుగుతున్నారు. మోదీ జీ మీరు ‘అగ్నివీర్’ ను సృష్టించాలనుకుంటున్నారా లేదా ‘జాతివీర్’ని సృష్టించాలనుకుంటారా’’ అని తన ఘాటైన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే బీజేపీ మిత్రపక్షం అయిన జేడీ(యూ)కి చెందిన ఉపేంద్ర కుష్వాహ, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్తో సహా పలువురు ఇతర ప్రతిపక్ష నాయకులు ఈ అంశాన్ని లేవనెత్తారు.
సైనిక సేవలో ఉన్నప్పుడు వైకల్యం సంభవిస్తేనే పెన్షన్ కు అర్హులు - సుప్రీంకోర్టు
అయితే ఈ ఆర్మీ ఆరోపణలను ఖండించింది. ఈ సర్టిఫికెట్లు అడగడం గతం నుంచే ఉందని చెప్పింది. ‘‘శిక్షణ సమయంలో, అలాగే విధి నిర్హహణ సమయంలో సైనికుల కట్టు కోసం, అలాగే ఒక వేళ మరణిస్తే మతపరమైన ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా మతం అవసరం ’’ అని ఆర్మీ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆరోపణలను తోసిపుచ్చారు.ఇది కేవలం పుకారని అన్నారు. “ స్వాతంత్రానికి పూర్వం నుంచే ఈ వ్యవస్థ కొనసాగుతోంది. ఎలాంటి మార్పు చేయలేదు. పాత పద్దతి కొనసాగుతోంది ’’ అని ఆయన స్పష్టం చేశారు.
సంజయ్ సింగ్ చేసిన ఆరోపణలపై బీజేపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ అమిత్ మాలవీయ ఎదురుదాడికి దిగారు.‘‘ 2013లో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సేన కులం, ప్రాంతం, మతం ఆధారంగా రిక్రూట్మెంట్ చేయదని స్పష్టం చేసింది. పరిపాలనా సౌలభ్యం, కార్యాచరణ అవసరాలు ఒక ప్రాంతం నుండి వచ్చే వ్యక్తుల సమూహాన్నిరెజిమెంట్ లో ఉంచడానికి ఉపయోగపడుతాయి. సైన్యం రెజిమెంటల్ వ్యవస్థ బ్రిటిష్ వారి కాలం నుండి ఉనికిలో ఉంది. స్వాతంత్రం తరువాత ఇది 1949లో ప్రత్యేక ఆర్మీ ఆర్డర్ ద్వారా అధికారికంగా మారింది. మోదీ ప్రభుత్వం ఇందులో ఏమాత్రం మార్పు చేయలేదు ’’ అని ట్వీట్ చేశారు.
