Asianet News TeluguAsianet News Telugu

16 ఏళ్ల బాలిక‌పై బంధువుల సామూహిక అత్యాచారం, దాడి.. అడ్డొచ్చిన అమ్మమ్మపై కూడా..

మేనమామ ఇంటికి వెళ్లిన ఆ బాలికకు చేదు అనుభవం ఎదురైంది. సమీప బంధువలే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దాడి చేయడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బాధితురాలు చనిపోయింది. 

A 16-year-old girl was gang-raped and assaulted by her relatives.
Author
First Published Aug 25, 2022, 12:47 PM IST

మ‌గాళ్లు మృగాళ్ల‌లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆడ పిల్ల‌లు క‌నిపిస్తే చాలు కామంతో రెచ్చిపోతున్నారు. వావి వ‌ర‌స‌లు మ‌రిచిపోయి దారుణాల‌కు ఒడిగ‌డుతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా లైంగిక దాడికి పాల్ప‌డుతున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లైంగిక దాడుల నివార‌ణ కోసం క‌ఠిన చ‌ట్టాలు తీసుకొచ్చినా. ఈ నేరాలు త‌గ్గుముఖం ప‌ట్టడం లేదు. ప్ర‌తీ రోజు ఎక్క‌డో ఒక చోట ఇలాంటి దారుణాలు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. 

డీఎంకే ఎమ్మెల్యే ఇంట్లో చదివింపుల విందు.. రూ.10 కోట్లు వసూలు.. !

తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ బాలిక‌పై సొంత బంధువులే సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆమెపై దాడి చేశారు. అడ్డొచ్చిన అమ్మ‌మ్మ‌ను కూడా అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న జబల్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాంఝీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై ఇది జ‌రిగింది. బాధితురాలు ముంబైలో తన తండ్రితో కలిసి నివ‌సించేంది. అయితే ఆగస్ట్ 11వ తేదీన జబల్‌పూర్‌లోని తన మేనమామ ఇంటికి వచ్చింది.

మోదీ పర్యటనలో భద్రతా లోపం: విధుల నిర్వహణలో ఫిరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీ విఫలం.. సుప్రీం కోర్టు

ఈ క్ర‌మంలో ఆగస్టు 13వ తేదీన ఇద్దరు బంధువులు బాలిక‌పై మొద‌టి సారిగా అత్యాచారం చేశారు. అప్ప‌టి నుంచి ఆమెకు క‌ష్టాలు మొదలయ్యాయి. ఆమెపై ప‌దే ప‌దే అత్యాచారం జ‌రిగింది. బాలిక‌పై శారీర‌కంగా కూడా దాడి చేశారు. దీనిని అడ్డుకున్న బాలిక అమ్మమ్మ‌ను కూడా రేప్ చేశారు. దీంతో మైన‌ర్ 19వ తేదీన ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరింది. మ‌రుస‌టి రోజు చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో చ‌నిపోయింది. ఆమె మృత‌దేహాన్నిజబల్పూర్‌లో ఖననం చేశారు. 

బాలిక‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని, త‌న‌పై జ‌రిగిన లైంగిక దాడిని బాధితురాలి తండ్రికి అమ్మ‌మ్మ వివ‌రించింది. దీంతో అత‌డు మంగ‌ళ‌వారం పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు (ఆగస్టు 23) బాధితురాలి మృతదేహాన్ని బయటకు తీశారు. అమ్మమ్మకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. 

కేరళలో వింత.. శవంతో నవ్వుతూ, తుళ్ళుతూ ఫ్యామిలీ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్..

బాధితురాలి బంధువులపై భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మ‌రో నిందితుడు ప‌రారీలో ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై విచారణ జరుగుతోంది. బాధితురాలిని అడ్మిట్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు విచారించే పనిలో పడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios