9 ఏళ్ల బాలికపై సవతి పైశాచికం.. కొడుకు, స్నేహితులతో గ్యాంగ్ రేప్.. కళ్లు పీకి, యాసిడ్ పోసి
మానవత్వం, విలువలు, బంధాలు మంటగలిసిపోతున్నాయి అనడానికి మరో తాజా ఉదాహరణ. సవతితో పాటు ఆమె సంతానంపై కక్ష గట్టిన ఓ మహిళ తాను తల్లినే అన్న సంగతిని మరిచి దారుణంగా ప్రవర్తించింది.
మానవత్వం, విలువలు, బంధాలు మంటగలిసిపోతున్నాయి అనడానికి మరో తాజా ఉదాహరణ. సవతితో పాటు ఆమె సంతానంపై కక్ష గట్టిన ఓ మహిళ తాను తల్లినే అన్న సంగతిని మరిచి దారుణంగా ప్రవర్తించింది.
9 ఏళ్ల సవతి కూతురిపై తన కొడుకు అతని స్నేహితులతో గ్యాంగ్రేప్ చేయించింది. అక్కడితో ఆగకుండా గొంతు నులిమి చంపి, కళ్లు పీకించి, యాసిడ్ పోయించి అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటన జమ్మూకశ్మీర్లో జరిగింది.
బారాముల్లా జిల్లాలోని యురికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు.. అయితే అతడు రెండో భార్యతోనే ఎక్కువగా గడపటం.. కూతురిని అపురూపంగా చూసుకోవడం మొదటి భార్యకు నచ్చలేదు.. సవతి, ఆమె కూతురిపై ద్వేషం పెంచుకున్న ఆ మహిళ చిన్నారిని చంపాలని నిర్ణయించుకుంది. ఆగస్టు 23న సరదాగా బయటకు వెళ్దామని కూతురిని వెంటబెట్టుకుని సమీపంలోని అడవికి వెళ్లింది.
పథకం ప్రకారం వారిని ఆమె కుమారుడు, స్నేహితులు అనుసరించి వచ్చారు. అడవిలోకి వెళ్లాకా.. కుమారుడ, అతని స్నేహితులతో సవతి కూతురిపై అత్యాచారం చేయించింది. అనంతరం చిన్నారి గొంతు నులిమి చంపింది. అనంతరం ఆమె కుమారుడు వరుసకు అన్న అయిన బాలుడు.. బాలిక తలపై గొడ్డలితో మోదాడు. అనంతరం అతని స్నేహితులు.. బాలిక కనుగుడ్లను కత్తితో బయటకు పెకిలించివేసి.. బాలిక శరీరం మొత్తం యాసిడ్ పోశారు.
తరువాత సవతి కూతురి మృతదేహాన్ని పొదల్లో ఆకులు, కొమ్మలతో దాచి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. కూతురి ఆచూకీ లభించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అడవిలో గుర్తు తెలియని చిన్నారి మృతదేహం కనిపించినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు కనిపించకుండా పోయిన బాలిక ఈమెనని గుర్తించి.. తండ్రికి తెలిపాడు. అనంతరం వేగంగా దర్యాప్తు చేసి సవతి తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమెతో పాటు.. ఆమె కుమారుడు, అతని స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.