యూపీలో ఘోర ప్రమాదం 13 మంది మృతి: 31 మందికి గాయాలు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నాగ్లాఖాంగార్ లో బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. 31 మంది గాయపడ్డారు.
ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై బుధవారం నాడు రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఢిల్లీ నుండి బీహార్ లోని మోతిహరికి బస్సు వెళ్తోంది. బస్సు నాగ్లాఖాంగార్ సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహయం అందించాలని సీఎం ఆదేశించారు.
Also read:కరీంనగర్లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
ఢిల్లీ నుండి బీహార్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొట్టింది.దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.