ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు లాంటి సమస్యలతో బాధ పడుతున్నారా? అయితే మీ కోసమే ఈ ఫేస్ ప్యాక్. ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో తయారయ్యే ఈ ఫేస్ ప్యాక్ తో మీ చర్మ సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు. మరి ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో చూసేయండి.
ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ఇందుకోసం చాలామంది ఖరీదైన ఉత్పత్తులు కూడా వాడుతుంటారు. బ్యూటీ ప్రోడక్టుల మీద చాలా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అన్ని డబ్బులు ఖర్చు చేసినా.. ఒక్కోసారి ఫలితం దక్కదు. మొదట్లో మార్పు కనిపించినా తర్వాత వాటి ప్రభావం తగ్గిపోతుంటుంది. మీరు కూడా ఇలా బ్యూటీ ప్రోడక్టులు వాడీ వాడీ విసిగిపోయారా? అయితే మీ కోసమే ఈ సహజమైన ఫేస్ ప్యాక్. ఈ ఒక్క ఫేస్ ప్యాక్ తో మీ చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్ ఏంటీ? ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.
ఆయుర్వేదం ప్రకారం…
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. చర్మ సమస్యలను తగ్గించుకునేందుకు బియ్యం పిండి ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనికూడా లేదు. ఈ ఫేస్ ప్యాక్ ను ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
- మట్టి కుండ
- పిడికెడు బియ్యం
- ఒక చెంచా మైసూర్ పప్పు
- ఐదారు బాదం పప్పులు
మీ అవసరాలకు తగ్గట్టుగా పదార్థాల పరిమాణం పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు.
ఫేస్ ప్యాక్ తయారీ విధానం..
- ఈ ఫేస్ ప్యాక్ కోసం ముందుగా ఒక మట్టి కుండ తీసుకోవాలి. కుండలో బియ్యం, మైసూర్ పప్పు, బాదం పప్పులు వేసి రాత్రంతా నానబెట్టాలి.
- మరుసటి రోజు బాదం పప్పుల తొక్క తీసి.. అన్నింటినీ మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బురోలు వాడితే మంచిది. అది లేకుంటే.. మిక్సర్లో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చిక్కగా ఉండేలా చూసుకోండి.
- ఈ ఫేస్ ప్యాక్ ని ముఖానికి రాసుకోవాలి. పూర్తిగా ఆరిపోకముందే నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి.
- ఈ చిట్కాను ప్రయత్నిస్తున్నప్పుడు, అవసరానికి మించి ప్యాక్ తయారు చేయకూడదు. ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే దీన్ని నిల్వ చేసుకోవచ్చు. మంచి ఫలితాలు పొందాలంటే.. ప్రతిసారీ కొత్తగా ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి రాసుకోవడం మంచిది.
ఫేస్ ప్యాక్ వల్ల కలిగే లాభాలు
ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.