Marriage: కాలంతో పాటుగా మనుషుల అలవాట్లు కూడా మారుతున్నాయి. ఒకప్పుడైతే.. మేనరికపు వివాహాలే ఎక్కువగా జరిగేవి. అయితే ఈ పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలకు అనారోగ్య సమస్యలొస్తాయని చాలా మంది అంటుంటారు. నిజానికి మేనరికపు వివాహల వల్ల నిజంగా పిల్లలు లోపంతో పుడతారా? లేదా? 


Marriage: చాలా వరకు తెలుగు కుటుంబాలల్లో మేనరికపు పెళ్లిల్లే ఎక్కువగా జరుగుతుంటాయి. దీనికి కారణాలు అనేకం. మేనమామ పిల్లలను పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల వారి ఆస్తి వీళ్లకే ఉంటుందన్న ధోరణితో కూడా మేనరికపు పెళ్లిళ్లు ఎక్కువగా చేస్తుంటారు. మరికొంతమందైతే మేనరికపు వివాహాల వల్ల వారి మధ్య బంధాలు మరింత బలబడతాయన్న ఉద్దేశంతో కూడా ఈ పెళ్లిళ్లను ఎక్కువగా చేస్తుంటారు.  ఇంకొందరేమో.. వారి బిడ్డలను ముక్కు మొహం తెలియని వారికెందుకు ఇవ్వడమని మేనళ్లుళ్లకిచ్చే పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలోనే ఈ మనరికపు వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ మేనరికపు పెళ్లిళ్లను ‘కన్ సాంగ్వినియస్ మ్యారెజెస్’ అని వైద్య పరిభాషలో పిలుస్తారు.

పిల్లల్లో లోపాలెందుకు వస్తాయి:  ఒకే కుటుంబానికి చెందిన ఆడ, మగ వారిలో జున్యువులు ఒకేలా ఉండే అవకాశం ఉంది. అంటే ఇద్దరిలోనూ అనారోగ్య కరమైన జన్యువులు కూడా కలిసే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడు పుట్టే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. అదే ఇతర వ్యక్తులను పెళ్లి చేసుకుంటే ఆరోగ్య కరమైన పిండం ఏర్పడుతుంది. అంటే ఒకవేళ ఆడవారిలోని జన్యువు క్వాలీటీ లేకపోయినా.. పురుషుడి నుంచి వచ్చే జన్యువు ఆరోగ్యంగా ఉండటంతో ఆ క్వాలిటీ లేని జన్యువును డామినేట్ చేసే అవకాశం ఉంది. దాంతో పుట్టే పిల్లల్లో ఎలాంటిలోపాలు ఏర్పడ అవకాశం ఉండదు. కానీ ఒకే కుటుంబానికి చెందిన స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో లోపాలు ఖచ్చితంగా వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మేనరికపు వివాహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఎలాంటి లోపాలు వచ్చే ప్రమాదముంది: మేనరికపు పెళ్లిల్లు చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా నరాలకు సంబంధించిన వ్యాధులు, శ్వాస సంబంధిత రోగాలు, కండరాలు, మూత్రపిండాల వ్యాధులు, గుండెకు హోల్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. ఈ జబ్బులన్నీ మేనరికపు వివాహాలు చేసుకున్న ప్రతి జంటకు ఇలాంటి లోపాలున్న పిల్లలు పుట్టే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పలేము. కానీ ఈ మేనరకిపు పెళ్లిళ్లు చేసుకున్న వారికి 4 నుంచి 6 శాతం పిల్లలకు ఇలాంటి రోగాలు వచ్చే అవకాశముందని వైద్యులు వెళ్లడిస్తున్నారు. 
 
అయితే పిల్లల్లో వచ్చే జన్యుపరమైన లోపాలను అడ్డుకోవడం అసాధ్యం . ముఖ్యంగా ఇలాంటి లోపాలను వైద్యులు కూడా నయం చేయలేరు. కాబట్టి గర్భం దాల్చిన వెంటనే వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం తప్పనిసరి. ఒకవేళ పిల్లల్లో మెదడుకు సంబంధించిన లోపం వస్తే.. అది వైద్యులు నయం చేయలేనిదిగా భావిస్తే.. వారిచ్చే సూచనలను పాటించాలి. ఒకవేళ గర్భస్రావం చేసుకోమని వైద్యులు సలహాలనిస్తే.. ఐదు నెలలలోపే చేసుకోవడం మంచిది.