భారత్లో పలు ఉగ్రదాడులకు కారణమైన ఖాలిద్ పాక్లో హతమయ్యాడు. అతని హత్యకు కాశ్మీర్లో జరిగిన తాలూకు భద్రతా చర్యలతో సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు.
భారత్లో సంచలనం సృష్టించిన పలు ఉగ్రదాడుల వెనుక ఉన్న లష్కర్-ఎ-తొయిబా (LeT) సీనియర్ ఉగ్రవాది సైఫుల్లా ఖాలిద్ పాకిస్థాన్లో హతమయ్యాడు. ఈ ఘటన సింధ్ ప్రావిన్స్లోని బాడిన్ జిల్లా మట్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఖాలిద్పై కాల్పులు జరిపి హతమార్చినట్టు అక్కడి స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
2005లో బెంగళూరులో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పై దాడి తర్వాతే. అలాగే 2006లో నాగ్పూర్లోని RSS కార్యాలయం, 2008లో రాంపూర్ CRPF శిబిరంపై జరిగిన దాడుల్లోనూ సైఫుల్లా ఖాలిద్ కీలక పాత్ర అని భారత భద్రతా శాఖలు భావిస్తున్నాయి. ఈ దాడుల వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
భారత్ నుంచి తప్పించుకొని ఖాలిద్ నేపాల్కు వెళ్లి “వినోద్ కుమార్” అనే నకిలీ పేరుతో అక్కడ జీవించాడు. అయితే అక్కడ ఉన్నప్పటికీ లష్కర్ కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొన్నాడు. నియామకాలు, లాజిస్టిక్స్ వంటి అంశాలను నిశితంగా పర్యవేక్షించినట్టు సమాచారం.ఇటీవల ఖాలిద్ పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్లోని మట్లి ప్రాంతంలో తలదాచుకున్నాడు. అక్కడ లష్కర్-ఎ-తొయిబా, జమాత్-ఉద్-దావా అనే సంస్థల తరఫున కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఐక్యరాజ్యసమితి ఈ రెండు సంస్థలపై నిషేధం విధించినప్పటికీ ఖాలిద్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు స్థానిక వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా నిధుల సేకరణ, కొత్త సభ్యుల నియామకాలపై దృష్టి పెట్టాడు.
ఖాలిద్ కి కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో సంబంధముందని భావిస్తున్నారు. గత వారం దక్షిణ కాశ్మీర్లో జరిగిన కాల్పుల్లో లష్కర్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో షాహిద్ కుట్టే అనే వ్యక్తి ‘ఆపరేషన్స్ కమాండర్’గా ఉన్నాడు. షోపియాన్ జిల్లాలోని షుక్రూ కెల్లర్ ప్రాంతంలో జరిగిన ఆ ఎదురుకాల్పుల్లో అద్నాన్ షఫీ, అహ్సాన్ ఉల్ హక్ షేక్ అనే ఇద్దరు మరణించారు. వారి వద్ద నుంచి భద్రతా దళాలు రెండు ఏకే సిరీస్ రైఫిల్స్, గ్రెనేడ్లు, భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కుట్టే స్థానిక యువతను ఉగ్రవాదంలోకి లాగడంలో ముఖ్యపాత్ర పోషించాడని భద్రతా వర్గాలు తెలిపాయి.