Asianet News TeluguAsianet News Telugu

4 రోజుల పర్యటన నిమిత్తం సెప్టెంబర్ 5న భారత్‌కు రానున్న బంగ్ల‌దేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 4 రోజుల పర్యటన నిమిత్తం సెప్టెంబర్ 5న భారత్‌కు రానున్నారు. తన పర్యటనలో హసీనా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్‌లతో సమావేశమై ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
 

Bangladesh Prime Minister Sheikh Hasina is coming to India on September 5 for a 4-day visit
Author
First Published Sep 1, 2022, 11:43 PM IST

బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల భారత పర్యటన నిమిత్తం సెప్టెంబర్ 5న న్యూఢిల్లీకి రానున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. తన పర్యటనలో హసీనా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్‌లను కలుస్తారని, ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియా సమావేశంలో తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఆమె పర్యటన సందర్భంగా సందర్శించే ప్రముఖులను కలవనున్నారు. ఆమె భారతదేశ పర్యటన సందర్భంగా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అజ్మీర్‌లో మధ్యయుగపు సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సంద‌ర్శించి.. నివాళులు అర్పించే అవకాశం ఉంది.

ఇటీవలి సంవత్సరాలలో, రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సందర్శనల మార్పిడి జరిగింది. అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇది రెండు దేశాల‌ సాంస్కృతిక మార్పిడితో కూడుకున్నదని బాగ్చీ చెప్పారు. "బంగాల్ల‌దేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా రాబోయే పర్యటన బలమైన చారిత్రక-సాంస్కృతిక సంబంధాల ఆధారంగా మన రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న బహుముఖ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. షేక్ హసీనాతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా భేటీ కానున్నారు. గత నెలలో, భారతదేశం-బంగ్లాదేశ్‌లు కుషియారా నది నీటి మధ్యంతర భాగస్వామ్యంపై ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఆగస్టు 25న ఢిల్లీలో జరిగిన భారత్- బంగ్లాదేశ్ జాయింట్ రివర్స్ కమిషన్ (జేఆర్‌సీ) 38వ మంత్రివర్గ స్థాయి సమావేశంలో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఖరారు చేయబడింది.

రెండు దేశాలు 54 నదులను పంచుకుంటున్నాయి. వీటిలో ఏడు నదులను ప్రాధాన్యతపై నీటి-భాగస్వామ్య ఒప్పందాల ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ముందుగా గుర్తించబడ్డాయి. ఉమ్మడి నదులపై పరస్పర ప్రయోజనాల సమస్యలను పరిష్కరించడానికి ద్వైపాక్షిక యంత్రాంగంగా 1972లో జాయింట్ రివర్స్ కమీషన్ ఆఫ్ ఇండియా-బంగ్లాదేశ్ ఏర్పాటు చేయబడింది. భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య మొత్తం వ్యూహాత్మక సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. గత ఏడాది మార్చిలోషేక్ ముజిబుర్ రెహమాన్ జన్మ శతాబ్ది-ఆ దేశ విముక్తి యుద్ధ 50 సంవత్సరాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ వెళ్లారు. సన్నిహిత సంబంధాల ప్రతిబింబంలో, బంగ్లాదేశ్ విముక్తికి దారితీసిన 1971 యుద్ధం 50వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశం అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించింది. డిసెంబర్ 16, 1971న భారత సైన్యం-ముక్తి బహిని ఉమ్మడి దళాల ముందు దాదాపు 93,000 మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు, ఇది బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మార్గం సుగమం చేసింది.

కాగా, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, అంతకుముందు, అక్టోబర్, 2019లో భారతదేశాన్ని సందర్శించారు. అయితే, భారతదేశం వైపు నుండి, మాజీ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్-ప్ర‌ధాని నరేంద్ర మోడీ మార్చి-డిసెంబర్ 2021 మధ్య బంగ్లాదేశ్‌ను సందర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios