14 హిందూ దేవాలయాలపై దాడి.. విగ్రహాలను ధ్వంసం చేసి, రోడ్డుపై పడేసి.. బంగ్లాదేశ్లో ఘటన
బంగ్లాదేశ్ లోని 14 హిందూ ఆలయాలపై దుండగులు దాడి చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసి, బయటపడేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

వాయువ్య బంగ్లాదేశ్లోని 14 హిందూ దేవాలయాలను గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి వరుస దాడుల్లో ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ఆదివారం ధృవీకరించారు. ఈ విషయంపై ఠాకూర్గావ్లోని బలియాడంగి ఉపజిల్లాలోని హిందూ సంఘం నాయకుడు విద్యానాథ్ బర్మన్ మాట్లాడుతూ.. “గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి దాడులు చేసి 14 దేవాలయాల విగ్రహాలను ధ్వంసం చేశారు” అని అన్నారు. కొన్ని విగ్రహాలను ధ్వంసం చేయగా, కొన్ని ఆలయాల సమీపంలోని చెరువుల్లో కనిపించాయని ఉపజిల్లా పూజ సెలబ్రేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి బర్మాన్ తెలిపారు. ‘‘నిందితులను ఇంకా గుర్తించలేదు, అయితే వారిని త్వరగా పట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము’’ అని అన్నారు.
భారత్ ప్రకాశాన్ని ఏ మహమ్మారి, ఏ యుద్ధమూ ఆపలేదు.. : ఇండియా ఎనర్జీ వీక్ లో ప్రధాని మోడీ
ఈ ఘటనపై హిందూ సంఘం నాయకుడు, సంఘ్ పరిషత్ అధ్యక్షుడు సమర్ ఛటర్జీ మాట్లాడుతూ.. ‘‘ఇంతకుముందు ఇలాంటి దారుణమైన ఘటన ఇక్కడ జరగలేదు. కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడూ మత సర్వమత సామరస్యానికి ప్రసిద్ధి చెందింది. ముస్లిం (మెజారిటీ) కమ్యూనిటీకి మాతో (హిందువులు) ఎలాంటి వివాదాలు లేవు. ఈ దాడి వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోలేకపోతున్నాం ’’ అని ఆయన అన్నారు. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున పలు గ్రామాల్లో దాడులు జరిగాయని బలియడంగి పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి అధికారి ఖైరుల్ అనమ్ తెలిపారు.
రామచరితమానస్ కాపీలను తగలబెట్టిన కేసులో ఇద్దరి అరెస్ట్.. జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు..
దీనిపై ఠాకూర్గావ్ పోలీసు చీఫ్ జహంగీర్ హుస్సేన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘దేశంలో శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించడానికి ముందస్తు ప్రణాళికతో దాడి ఇది అని స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు తక్షణమే విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ఠాకూర్గావ్ డిప్యూటీ కమిషనర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మహబూబుర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ కేసు శాంతి, మత సామరస్యానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రగా కనిపిస్తోంది. ఇది తీవ్రమైన నేరం.’’ అని అన్నారు.
టర్కీ, సిరియా భూకంపం మృతులకు ప్రధాని మోడీ సంతాపం.. ఈ విషాదం ఎంతో బాధను కలిగించిందని వ్యాఖ్య
కాగా.. పూజా పరిషత్ ప్రధాన కార్యదర్శి తపన్ కుమార్ ఘోష్ హరిబసర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం సింధుర్పిండి ప్రాంతంలో ఉంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు విరిగిన ఆలయ విగ్రహాలను ఆలయానికి మరో వైపు విసిరివేయడం ఖండనీయమని బలిదంగి ఉపజిల్లా పరిషత్కు చెందిన మహ్మద్ అలీ అస్లాం జ్యువెల్ అన్నారు. ఇదిలా ఉండగా.. సింధుపిండి ప్రాంతానికి చెందిన కాశీనాథ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ స్థిరపడిన హిందువుల్లో భయానక వాతావరణం నెలకొంది.