హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ చేశారు. శనివారం (మే 17న) తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్లో మే 17న జరిగే తిరంగా ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్లు పలు ఆంక్షలు విధించారు. ఈ ర్యాలీ సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు అంబేడ్కర్ విగ్రహం నుంచి చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని M-47 ప్యాటన్ ట్యాంక్ వరకు సాగనుంది.
ఈ సమయంలో ట్రాఫిక్ను కొన్ని ప్రాంతాల్లో మళ్లించనున్నారు. ప్రజలు ట్రాఫిక్ జాం నివారించేందుకు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా ఉంటాయి:
అంబేడ్కర్ విగ్రహం ప్రాంతం:
సెక్రటేరియట్ జంక్షన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ వైపు మళ్లిస్తారు.
అదే విధంగా, లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ట్రాఫిక్ను తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
సెయిలింగ్ క్లబ్:
కర్బలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వస్తున్న వాహనాలను కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
డీబీఆర్ మిల్స్ (DBR Mills):
డీబీఆర్ మిల్స్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను గోశాల-కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
ట్రాఫి జామ్ అయ్యే అవకాశమున్న ప్రాంతాలు:
అంబేడ్కర్ విగ్రహం, సెయిలింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, సెక్రటేరియట్ జంక్షన్, ఇక్బాల్ మినార్, విఆర్ స్ట్యాచ్యూ (VV Statue), లిబర్టీ ప్రాంతాలు.