విరాట్ కోహ్లీ నంబర్ వన్
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ నంబర్.
- రోహిత్, ధోనీ వరుసగా 9,10 స్థానాలు.
- బుమ్రాకు నాలుగవ స్థానం.
- మూడవ స్థానంలో టీం ఇండియా.
శ్రీలంకతో అద్బుతంగా రాణించిన విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ టాప్ లో నిలిచాడు. గతంలో రెండవ స్థానంలో ఉన్న కోహ్లీ 887 పాయింట్లతో నెం.1 స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ, ధోనీ తోమ్మిది, పది ర్యాంకిగ్స్ లో ఉన్నారు. అదేవిధంగా లంకతో వన్డే సిరీస్ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఆటగాళ్ల ర్యాంకింగ్స్ కుడా మెరుగుపడ్డాయి. మరోవైపు టీ20ల్లోనూ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. కాగా, బౌలర్స్ ర్యాంక్స్లో జస్ప్రీత్ బుమ్రా 27 స్థానాలు ఎగబాకి 687 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇది ఆయన కెరీర్లోనే బెస్ట్ ర్యాంక్. కొత్త బౌలర్ అక్షర్ పటేల్ 10 వ స్థానంలో నిలిచాడు.
ఇక జట్టు పరంగా తీసుకుంటే భారత్ 117 పాయింట్లతో తన మూడవ స్థానాన్ని నిలుపుకుంది.
ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్..
1. విరాట్ కోహ్లీ (887 పాయింట్లు)
2. డేవిడ్ వార్నర్ (861)
3. ఏబీ డివిలియర్స్ (847)
4. జో రూట్ (799)
5. బాబర్ అజామ్ (786).
ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగులు.
1.హేజిల్ వుడ్ (732)
2. తాహిర్ (718)
3. మిచెల్ స్టార్క్ (701)
4. జస్ప్రీత్ బుమ్రా (687)
5. రబాడ్ (685)
మరిన్ని తాజా వార్తల కోసం కింద క్లిక్ చేయండి....