వనపర్తి జిల్లాలో విషాదం కోనేటి స్నానానికి వెళ్లి ముగ్గురు యువకుల మృతి

వనపర్తి జిల్లా అడ్డాకుల మండలం కందూరులో విషాదం చోటుచేసుకుంది. జాతర సందర్భంగా దైవదర్శనానికి వెళ్లిన ముగ్గురు యువకులు కోనేరులో మునిగి మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు ప్రమాదస్థలంలో మిన్నంటాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మహబూబ్ నగర్ కు చెందిన ఓ కుటుంబం కందుకూరులోని శ్రీరామలింగేశ్వరస్వామి జాతరకు వెళ్లారు. అయితే దైవదర్శనం కోసం స్పానాలు చేయడానికి కోనేటి స్నానానికి వెళ్లారు. అయితే స్నానానికి దిగిన రవికుమార్, పవన్‌కుమార్, ఆంజనేయులు అను ముగ్గురు సోదరులు కొనేరు లోతు తెలుసుకోకుండా ముందుకువెళ్లారు. ఈ క్రమంలో బాగా లోతులోకి ఒకరి వెంట ఒకరు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. నీటిలో మునిగి ఊపిరాడక ముగ్గురు సోదరులు ప్రాణాలు విడిచారు. సరదాగా గడపడానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన యువకులు ఇలా ప్రమాదానికి గురై మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలకోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు రవికుమార్‌, పవన్‌కుమార్‌ మృతదేహాలు లభించగా, ఆంజనేయులు మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు.