Asianet News TeluguAsianet News Telugu

ఇవాంక నుంచి కేటీఆర్ కు పిలుపు

  • మరో సారి ఇవాంకతో భేటీ కానున్న కేటీఆర్
  • 2018 పిబ్రవరి 12 న కేటీఆర్ అమెరికా పర్యటర ఖరారు
  • మంత్రి పర్యటన వివరాలను తెలిపిన జయేష్ రంజన్ 
telangana it minister ktr america tour sheduled

 తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు ఇవాంక ట్రంప్ తో మరోసారి భేటీ కానున్నారా? అంటే అధికారుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అయితే ఇప్పటికే ఇవాంక అమెరికాకు వెళ్లిపోయారు కదా మరి భేటీ ఎలా జరుగుతుందని అనుకుంటున్నారా. అయితే ఈ స్టోరి చదవండి.

జీఈఎస్ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడి కూతురు, సలహాధారు ఇవాంక కేటీఆర్ అమెరికాకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆమె, ఆహ్వానంతో పాటు అధికారికి కార్యక్రమాల నిమిత్తం ఐటీ మంత్రి అమెరికాకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన ఇవాంకతో భేటీ అవుతారని ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. అదే విధంగా కేటీఆర్ అమెరికా అధికారిక పర్యటన వివరాలను కూడా తెలియజేశారు. 

కేటీఆర్ 2018 ఫిబ్రవరి 12 ఓ ఐటీ బృందంతో కలిసి అమెరికాలో పర్యటించనున్నారు.అక్కడి హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమానికి మంత్రి హజరుకానున్నారు. అలాగే ఈ పర్యటనలోనే మంత్రి కేటీఆర్ ఇవాంక తో భేటీ అవనున్నారు. యూఎస్ వచ్చినపుడు తనను కలవాలన్న ఇవాంక ఆహ్వానం మేరకు ఆమెతో మర్యాదపూర్వక భేటీ సాగనుందని జయేష్ రంజన్ తెలిపారు. 

జీఈఎస్ సదస్సు నిర్వహణ పట్ల ఇవాంక సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ సదస్సు వల్ల భారత్, అమెరికా సంబందాలు మెరుగుపడనున్నాయని ఇవాంక తెలిపిసట్లు జయేష్ మీడియాకు వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగిన ఇవాంక పర్యటన వల్ల హైదరాబాద్ ప్రపంచ దేశాల దృష్టిలో పడిందని ఆయన అన్నారు. ఈ సదస్సు ఇంత విజయవంతంగా నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఇక పిబ్రవరిలో జరిగే ఇవాంక, కేటీఆర్ ల భేటీతో అమెరికాతో తెలంగాణ సంభందాలు మెరుగుపడతాయని జయేష్ అభిప్రాయపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios