స్విమ్మింగ్పూల్ లో ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్లు(వీడియో)
- కొలంబో హోటళ్ స్విమ్మింగ్ పూల్ లో క్రికెటర్లు.
శ్రీలంక పర్యటన లో టీం ఇండియా భారీ విజయాలను సాధించింది. మొదటి రెండు టెస్టుల విజయం తరువాత టీం ఇండియాకు 5 రోజుల పాటు ఖాళీ దొరికింది. దీంతో క్రికెటర్లు తమ కొద్దిపాటి తీరిక సమయాన్ని సరదాగా గడపాలనుకున్నారు. ప్రస్తుతం వారు కొలంబోలోని ఓ హోటళ్లో విడిది చేశారు. అక్కడ ఉన్న స్విమ్మింగ్పూల్లో భారత జట్టు ఆటగాళ్లు జల్సాగా కేరింతలు కొడుతున్న వీడియోను `ఇండియన్ క్రికెట్ టీమ్` తమ ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
ఆ వీడియో పై మీరు ఓ లూక్కేయండి
మూడవ టెస్టు 12వ తేదిన ప్రారంభం కానుంది. అందులో ఆల్ రౌండర్ జడేజా ఆడటం లేదు. కారణం అతని పైన ఐసీసీ ఒక టెస్టు నిషేధం విధించింది. జడేజా స్థానంలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి.