ట్విట్టర్ లోకి ప్రథమ పౌరుడు
ట్విట్టర్ లో రామ్ నాథ్ కోవింద్
3.25మిలియన్ ఫాలోవర్లు
మన దేశ ప్రథమ పౌరుడు ఈ రోజు ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు. రామ్ నాథ్ కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా..ఆయన ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాష్ట్రపతిగా ఆయన పేరిట రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విట్టర్ ఖాతను తెరిచింది. ఈ ఖాతా తెరిచిన కొద్ది సమయానికే 3.25మిలియన్ల మంది ఫాలోవర్లుగా మారారు.
‘భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా ప్రమాణం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నా బాధ్యతల్ని వినయ విధేయతలతో నిర్వహిస్తాను.’ అని ఆయన తన తొలి ట్వీట్లో పేర్కొన్నారు.