- అవమానించిన ఒప్పో కంపెనీ యాజమాన్యం
- ఆగ్రహించిన పంజాబ్ యూనిట్ ఉద్యోగులు
- ఉద్యోగాలకు రాజీనామా
ప్రముఖ చైనా మొబైల్ ఉత్పత్తుల సంస్థ ‘ఒప్పో’ పంజాబ్ యూనిట్లో ఒకేసారి ఉద్యోగులంతా రాజీనామా పత్రాలు సమర్పించారు.
జీతాలు పెంచాలని కంపెనీని కోరితే భారతీయులను అవమానపరిచేలా ...‘భారతీయులంతా బిచ్చగాళ్లు’ అని ఒప్పో యాజమాన్యం
వ్యాఖ్యలు చేసిందని వారు పేర్కొన్నారు. ఈ కారణంగానే తామంతా రాజీనామా పత్రాలు సమర్పించినట్లు ఉద్యోగులు తెలిపారు. కాగా ఈ
వ్యవహారమంతా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ అంశంపై ఒప్పో కంపెనీ స్పందించింది. అధికారిక ప్రకటనను విడుదల
చేసింది. రెండు వర్గాల మధ్య సమాచార లోపం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. పంజాబ్ యూనిట్లో జరిగిన ఘటన గురించి
తమకు తెలుసని.. జులై 15న ఈ ఘటన జరిగితే 16న సమస్య పరిష్కారమైందని కంపెనీ చెప్పింది. రెండు వర్గాల మధ్య సమాచారలోపం
వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఏకాభిప్రాయం కుదిరి ఉద్యోగులంతా తిరిగి విధుల్లోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు .
భారత్ అంటే మాకు ఎంతో గౌరవమని.. ఆ దేశ సంస్కృతి, మా ఉద్యోగులను ఎంతో గౌరవిస్తామని, భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా
చూస్తాం’ అని కంపెనీ హామీ ఇచ్చింది.
Last Updated 25, Mar 2018, 11:38 PM IST