రాష్ట్రపతి భవనంలోని రెండవ దళిత వ్యక్తి. 17 సంవత్సరాలు కొనసాగిన నిర్మాణం. 400 ఎక‌రాల‌లో రాష్ట్రపతి భవనం.
14 వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్. కౌంటింగ్ లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. త్వరలో ఆయన ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. దళిత వ్యక్తిగా రాష్ట్రపతి భవనంలో ఆయన తన అధికారాలను నిర్వహించనున్నారు.కే.ఆర్ నారాయణ తరువాత భారత రెండవ దళిత వ్యక్తి రాష్ట్రపతి భవనం అడుగుపెట్టనున్నారు. ఆయనకు కల్పించే సకల సదుపాయలు ఇప్పుడు చుద్దాం.
రాష్ట్రపతి భవనం చరిత్ర.
బ్రిటీష్ వైస్రాయ్ నివాసం కోసం 1911లో కలకత్తాలో ఒక భవనాన్ని నిర్మించాలని అనుకున్నారు. అయితే అప్పుడే ఢిల్లీ దర్బార్ వైభోగం గురించి విన్న బ్రిటీషర్లు కలకత్తాలో నిర్మించాల్సిన వైస్రాయ్ భవనాన్ని ఢిల్లీకి మార్చారు. ఢిల్లీలో వైస్రాయ్ భవన నిర్మాణానికి 1911 నుండి 1916 వరకు భూసెకరణ జరిగింది అప్పుడు రాష్ట్రపతి భవనం గురించి 300 కుటుంబాలను తరలించారు. కానీ రాష్ట్రపతి భవనం (అప్పుడు వైస్రాయ్ భవనం అనే వారు) మాత్రం జూన్ 14, 1912లో కట్టడం ప్రారంభించారు. 400 ఎకరాలలో నిర్మాణం ప్రారంభించారు. ఈ భవనానికి బ్రిటీష్ ఆర్కిటెక్ ఎడ్విన్ లాన్సీర్ లాటియెన్స్ పనిచేశారు.
ఈ భవనాన్ని నిర్మించడానికి 17 సంవత్సరాలు పట్టింది. ఆ కాలంలో ఒక కోటి నలబై లక్షల రూపాయలు వెచ్చించారు. 1929 జూలై 23వ తేదిన రాష్ట్రపతి భవన నిర్మాణం పూర్తయింది. దాదాపుగా 2 లక్షల చదరపు అడుగులు విస్తరించి ఉంది. ఈ భవనంలో 4 అంతస్థులతో 340 గదులు కల్గి ఉన్నాయి. లోపల అంతా ఇండియా-యూరోపియన్ సంసృతి కల్గిన డిజైన్లు కలిగి ఉంటాయి. రాష్ట్రపతి భవన్లో మెఘల్ గార్డెన్ ఉంది ఈ గార్డెన్ ప్రపంచంలోనే 250 రకాల రోజా పూలకు ప్రసిద్ది.
ఇతర సౌకర్యాలు
రాష్ట్రపతి నివాసం కోసం ఢిల్లీలో రాష్ట్రపతి భవనం కాకుండా మరో రెండు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఒకటి సిమ్లా దగ్గర మషోబ్రా, రెండవది హైదరాబాద్లొని బొల్లారం వద్ద భవనాలు ఉన్నాయి. ఇవి కేవలం రాష్ట్రపతి ప్రత్కేక విడిది కోసం ఏర్పాటు చేశారు. సవంత్సరంలో ఒక్క సారి ఈ విడిది కేంద్రాల వద్ద దేశ రాష్ట్రపతి విశ్రాంతి తీసుకుంటారు.