జియోకు కోర్టు షాకిచ్చింది
- జియోకు షాక్ ఇచ్చిన ముంబాయి కోర్టు.
- ఎయిర్ టెల్ పై కోర్టులో పిటీషన్ వేసిన జియో
- జియో ఫిటిషన్ కొట్టివేసిన కోర్టు.
రిలయాన్స్ అధ్యక్షుడు ముఖేష్ అంబానీకి ఎదరుదెబ్బ తగిలింది. టెలికాం రంగం జెట్ స్పీడ్ కన్న వేగంగా దూసుకుపోతున్న జియోకు కళ్లే వేసింది ముంబాయి కోర్టు.
వివరాల్లో కి వెళ్తే జియోకు, ఎయిర్టెల్ కు మధ్య పోటీ తెలిసిందే. టారీఫ్, డేటా పై ఇరు సంస్థలు పోటీలు పడుతున్నాయిరు. అయితే ఎయిర్టెల్ పై జియో కోర్టుకు వెళ్లింది. జియో పిటిషన్ ను ముంబాయి మెట్రోఫాలిటన్ కోర్టు విచారించింది. విచారణ అనంతరం జియో పిటిషన్ ను కొట్టి వేసింది.
దేశంలో అత్యంత వేగవంతమైన నెట్వర్క అని ఎయిర్టెల్ ప్రకటనలు వేసుకుంది. ఇదే విషయం పై జియో ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో ఎయిర్టెల్ పై పిటిషన్ దాఖలు చేసింది. ఎయిర్టెల్ తమ వాణిజ్య ప్రకటనలల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటోందని పిటిషన్ వేసింది. ఎయిర్టెల్ దేశంలో ఉన్న టెలికాం వినియోగదారులను మోసం చేస్తుందని పిటిషన్ లో పేర్కొంది. అందుకు ఎయిర్ టెల్ పై చర్యలు తీసుకోవాలని కోరింది.
అయితే కోర్టు జియో పిటిషన్ కు రిప్లై ఇస్తూ... ఏ సంస్థ అయినా తమ వ్యాపారాలను విస్తరించుకునే క్రమంలో, తమకు నచ్చిన ఉత్తమమైన పద్ధతిలో ప్రకటనలు ఇవ్వొచ్చని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. కోర్టు తీర్పుతో జియోకు చుక్కేదురైనట్లయింది.