భారతీయులకు ప్రియమైన నాయకురాలు సుష్మా - వాల్ స్ట్రీట్ జర్నల్
- భారతీయులు ఎ సమస్యలో ఉన్న తక్షణ సహాయం.
- ట్వీట్ చేస్తే చాలు తప్పకుండా సహాయం.
- కోట్లాది మంది కి ఇష్టమైనా నాయకురాలు.
పాకిస్తాన్ కి చెందిన రోహన్ సిద్ధిఖీ అరుదైనా ఆరోగ్య సమస్యతో ఇండియా చికిత్స దొరుకుతుంది అని తెలిసి సుష్మా స్వరాజ్ కి ట్వీట్ చేశారు, దానికి స్పందించిన సుస్మా వారికి భారత్ కు రావడానికి వీసాలు జారీ ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల భారత్లో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. చికిత్స అనంతరం సిద్ధిఖీ తండ్రి మాట్లాడుతూ.. ఈ రోజు నా చిన్నారి గుండె సుష్మాస్వరాజ్ మేడం కోసం కొట్టుకుంటోంది అని అన్నారు. దీనిపై స్పందించిన సుష్మాస్వరాజ్.. రోహన్ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని ట్వీట్ చేశారు
ఇదే విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని అమెరికా ప్రముఖ వార్తా పత్రిక అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పై ఇక కథనం వెల్లడించింది. అందులో సుష్మాస్వరాజ్ ఆపదలో ఉన్నామంటూ ఏ ఒక్కరు ట్వీట్ చేసినా.... ప్రపంచంలో ఏ మూలన భారతీయులు ఉన్నా ఆమె నుంచి తక్షణ సాయం అందుతుందిని వ్రాసింది. అంతేకాదు అందులో ఇలా ప్రస్తావించారు...ఆమె భారతీయులనే కాదు.. కష్టాల్లో ఉన్న విదేశీయులను సైతం ఆదుకుని ఎన్నోసార్లు మానవత్వం చాటారు. అందుకే సుష్మాను భారత్ మెచ్చిన రాజకీయనాయకురాలు అని కొనియాడింది అంతర్జాతీయ మీడియా.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రపంచ ప్రఖ్యాతీగాయించిన పత్రిక