Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో కన్న కూతురినే చంపిన తల్లి

  • విజయవాడలో విషాదం
  • కన్న కూతురినే చంపిన తల్లి
  • హత్యా నేరం కింద అరెస్ట్ చేసిన పోలీసులు
  •  
lovers kill illicit newborn baby by throwing her into canal fearing retribution

మాతృమూర్తి అంటే మానవత్వానికి ప్రతీక. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ తన ప్రేమను పంచుతూ అల్లారుముద్దుగా చూసుకునే మాతృమూర్తులను మనం చూస్తుంటాం. కానీ నవమాసాలు మోసి కన్న చిన్నారిని కాలువలో పడేసి కర్కశానికి మారుపేరుగా నిలిచిన ఓ కన్నతల్లిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన విజయవాడలో జరిగింది.  

వివరాల్లోకి వెళితే నూజివీడుకు చెందిన ఓ మహిళకు నాలుగేళ్లక్రితం మేనమామతో వివాహమైంది. అయితే భర్తతో మనస్పర్ధలు రావడంతో పుట్టింట్లోనే ఉంటోంది. అయితే ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేసే ఓ సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా అక్రమసంభందంగా మారడంతో సదరు మహిళ గర్భం దాల్చింది. దీంతో ఊళ్లోనే వుంటే పరువు పోతుందని భావించిన ఆమె తల్లి తమ మకాం విజయవాడకు మార్చారు. ఈ క్రమంలో ఆమె విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది.

 అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఆ తల్లిలో మృగం మేల్కొంది. వారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు రాగానే పట్పాత్ నుంచి శిశువును రైవస్ కాలువలో పడేశారు. తర్వాత తమకు ఏమీ తెలీదన్నట్లుగా ఇంటికెళ్లిపోయారు.

అయితే ఆ చిన్నారి మృతదేహం కాలువలో కొట్టుకువచ్చి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వెనుకవైపు నీటిలో చెత్తలో చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శిశువు మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు చేతికి ఉన్న తెలుపుబ్యాండ్ ఆధారంగా ధర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విధంగా ఆస్పత్రుల్లోనే బ్యాండ్ వేస్తారని గుర్తించిన పోలీసులు ఆస్పత్రుల్లో విచారణ చేయగా నిందితులు బయటకువచ్చారు.దీంతో పోలీసులు శిశువు తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios