Asianet News TeluguAsianet News Telugu

జియో మరిన్ని ఆఫర్లకు సిద్దమయింది.

రూ 500 కే 4జీ ఫోన్ 

జియో డిష్ టీవి పై చర్చ

ఆఫర్ల వివరాలలో గొప్యత

JIO will ready to provide new offers

రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా ఆరు నెలల ఉచిత డేటాను అందించి సంచలనం సృష్టించింది.  త‌క్కువ స‌మ‌యంలో కోట్ల మంది యూజ‌ర్ల‌ను చెర్చుకున్న జియో మ‌రో సంచ‌ల‌నానికి నాంది ప‌ల‌క‌నుంది. ఇప్ప‌టికి 309 తో మ‌రో మూడు నెల‌ల అన్‌లిమిటేట్ కాల్స్ మ‌రియు డెటాను ఇస్తున్న‌ జియో మ‌రో నూత‌న ఆఫ‌ర్ల‌కు తెర తీయ్య‌నుంది.

కేవ‌లం రూ 500 కే 4జీ ఫోన్‌

జియో మ‌రో రెండు రోజుల్లో  ఏజిఎం స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఇందులో ముఖేష్ అంబానితో స‌హా అంద‌రు రిల‌యన్స్ అధికారులు పాల్గొంటారు. అందులో మొద‌ట‌గా 500 రూపాయ‌ల‌కు 4జీ ఫోన్ పైన నిర్ణ‌యం తీసుకోనున్నారు. త‌రువాత దేశ వ్యాప్తంగా ఇంట‌ర్నేట్ బ్రాడ్ బ్యాండ్ సేవ‌ల‌ను కూడా ప‌రిశీలించ‌నున్నారు. దేశ వ్యాప్తంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెల‌కు 100జీబీ డేటాను అందించ‌డానికి ప్ర‌య‌త్నాలు చెస్తున్నారు. దీనిపైన కూడా చ‌ర్చించ‌నున్నారు.

JIO will ready to provide new offers


ఇక మూడ‌వ స్థానంలో డిష్ టీవీలను జియో నుండి ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టికే ముమ్మ‌రం చేశారు. ఈ స‌మావేశంలో ఎప్పుడు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకురానున్నారు అనే విష‌యం పైన కూడా పూర్తిగా క్లారిటి వ‌చ్చే అవ‌కాశం ఉంది. త‌రువాత జియో హాట్‌స్పాట్ ల‌ను కూడా మేట్రో పాలిట‌న్ న‌గ‌రాల‌లో విస్త‌రించ‌డానికి ప‌లు రంగం సిద్దం చేశార‌ని తెలుస్తుంది. 

అయితే ఇవే కాకుండా మరిన్ని ఆఫర్లను కూడా జియో ప్రజలకు అందించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇతర సంస్థలకు లీక్ అవుతాయన్న ఉద్దేశంతో గోప్యత పాటిస్తుంది. రిల‌య‌న్స్‌ స‌ర్వ స‌భ్య స‌మావేశం వ‌ర‌కు వేచి చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios