హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం ఇంటర్మీడియట్ విద్యార్థిని నరికి చంపిన దుండగులు

ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలో సుధీర్ అనే విధ్యార్థిని పట్టపగలే కొందరు దుండగులు వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య స్థానికంగా కలకలం సృషటించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


ఇవాళ ఉదయం ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి మూసాపేట్ నుండి కూకట్ పల్లి వైపు వెళుతున్న సుధీర్ ను కొందరు దుండగులు వేటకొడవళ్లతో వెంబడించారు. అయితే వీరిని గమనించిన అతడు వెంటనే ఓ బస్సు ఎక్కి తప్పించుకోడానికి ప్రయత్నించాడు. అయితే ఈ బస్సును వెంబడించిన దుండగులు కూకట్ పల్లి జెఎస్పిహోండా షో రూమ్ వద్ద సుధీర్ పట్టుకుని నడిరోడ్డుపైనే అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ హత్యకు సుధీర్ కు అతడి స్నేహితులతో జరిగిన వివాదమే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సుధీర్‌ స్నేహితులు నవీన్‌, కృష్ణ, మహీ, తేజ తదితరులు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.