ఫైనల్ లో పోరాడి ఓడిన టీం ఇండియా 9 పరుగుల తేడాతో ఓటమి. అద్బుతప్రదర్శనతో పైనల్
ఐసీసీ మహిళ ప్రపంచ కప్ లో టీం ఇండియా అద్బుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. కానీ చివరికి పైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఓటిమి పాలయింది. కేవలం 9 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 229 పరుగుల టార్గెట్ ను ఇండియా ముందు ఉంచింది. విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌటైయింది. ఇండియా బ్యాటింగ్లో వారు చేసిన పరుగులు వరుసగా మంధన 0, మిథాలీ రాజ్ 17, హర్మన్ ప్రీత్ కౌర్ 51, పూనమ్ రౌత్ అద్బుతమైన బ్యాటింగ్తో 115 బంతులతో 86 పరుగులు చేసింది. సుష్మా వర్మ 0, వేద కృష్ణమూర్తి 35, జె.గోస్వామి సున్నా, పాండే 4, దీప్తీ శర్మ 14, గైక్వాడ్ సున్నా పరుగులు చేసి అవుటయ్యారు. ఐదవ వికేట్ నుండి టీం ఇండియా వరుసగా వికెట్లు పడిపపొయ్యాయి. అయినా ఇండియా గెలుస్తుందని భావించిన ఇంగ్లాండ్ అద్బుతమైన బౌలింగ్తో ఇండియన్ బ్యాట్స్ఉమేన్లను కట్టడి చేశారు.
గతంలో ఏనాడు లేని విధంగా ఈ సారి మహిళ ప్రపంచ కప్ కి అత్యధిక ప్రేక్షకుల స్పందన వచ్చింది
