బెంగళూరులో పట్టపగలే రెచ్చిపోయిన పేకాటరాయుళ్లు పేకాట స్థావరంపై రైడింగ్ చేసిన పోలీస్ పైనే దాడి
కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే పేకాటరాయుళ్లు రెచ్చిపోయారు. ఓ పేకాట స్థావరం గురించి సమాచారం అందుకుని రైడింగ్ వెళ్లిన ఓ పోలీసులపైనే పేకాటరాయుళ్లు దాడికిదిగారు. దుండగులంతా మూకుమ్మడిగా చితకబాదడంతో వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ పోలీస్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. పేకాట ఆడటమే కాకుండా దీన్ని ఆపడానికి ప్రయత్నించిన పోలీస్ పై దాడి చేసినందుకు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
వీడియో
Scroll to load tweet…
