ఢిల్లీ లోను డ్రగ్స్ ప్రకంపనలు
- డ్రగ్స్ రాజధాని ఢిల్లీలో.
- 8 కోట్ల విలువైనా హెరాయిన్ పట్టివేత.
- ముగ్గురు అరెస్టు.
తెలంగాణ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును ఎక్సైజ్ శాఖ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేస్తుంది. ఆ విచారణలో ఎక్కువ మంది టాలీవుడ్ తారలు ఉండటం ఆందోళనకు గురి చేస్తుంది. తెలంగాణ లో డ్రగ్స్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చుట్టు డ్రగ్స్ కేసు తిరుగుతుంది. ఒకప్పుడు డ్రగ్స్ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేవి, కానీ నేడు డ్రగ్స్ దేశ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ప్రతి రోజు పట్టుబడుతున్నాయి.
ఢిల్లీలో 8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.
ఢిల్లీ స్పెషల్ పోలీసులు శనివారం ఉదయం 9 గంటలకు ఎనిమిది కోట్ల విలువైన హెరాయిన్ను పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీళ్లలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు, ఒక్కరు మన భారతీయుడిగా పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ మాఫియా ను అంతం చేయ్యడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని అక్కడి పోలీసు శాఖ తెలిపింది. రాజధానిలో ఎక్కడ డ్రగ్స్ దందా జరుగుతున్నా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇటు తెలంగాణలో, అటు దేశ రాజధాని ఢిల్లీలో పట్టుబడ్డ వ్యక్తులు నైజీరియన్లు కావడం విశేషం.