దిగ్విజయ్ కి కోర్టు నోటీసులు అనుచిత వ్యాక్యాల పై కోర్టు కేళ్లీనా ఎమ్ఐఎమ్ నాయకుడు ఆగష్టు 10 లోగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

 దిగ్విజయ్ సింగ్ కి కోర్టు సమన్లు జారీ చేసింది. నాంపల్లి కోర్టు ఆయ‌న ఆగ‌ష్టు 10 తేదీ లోపు కోర్టుకి హాజ‌ర‌వ్వ‌ల‌ని ఆదేశాలు జారీ చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నీక‌ల్లో ఏఐసీసీ జ‌న‌ర‌ల్ బీజేపి అధ్య‌క్షుడు అమిత్ షా, ఎమ్ఐఎమ్ నాయ‌కుడు అస‌ద్దున్ ల క‌ల‌యిక పై అనుచిత వ్యాక్య‌లు చేసినందుకు నాంప‌ల్లీ కోర్టు స‌మాన్లు జారీ చేసింది. అమిత్ షా, అస‌ద్దున్‌లు క‌లిసి రాజ‌కీయాలు
చేస్తున్నార‌ని ఆయ‌న గ‌తంలో ఆరోప‌ణ‌లు చేశారు. 

ఇదే విష‌యం ఎమ్ఐఎమ్ జనరల్ సెక్రెటరీ అన్వర్ కోర్టు కేళ్లారు, ఆయ‌న పెట్టిన కేసును ప‌రిశీలించిన కోర్టు డిగ్గీ రాజాకు స‌మన్లు జారీ చేసింది. వ‌చ్చే నెల 10వ తేది వ‌ర‌కు నాంపల్లి క్రిమినల్ కోర్ట్ ముందు హాజరుకావాలని ఎనిమిదవ అదనపు మెట్రోపాలిటన్ కోర్ట్ తెలిపింది.