సౌత్ ఇండియన్ సాంప్రదాయ దుస్తుల్లో రాహుల్ గాంధీ
ఎన్నికల ప్రచారంలో బాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ కర్ణాటకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా కర్ణాటకకు చేరుకున్న రాహుల్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి చిక్ మంగళూరులోని శృంగేరి శారదా పీఠంలోని శారదాంబ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయానికి రాహుల్ దక్షిణాది సాంప్రదాయ వస్త్రదారనైన ధోతీ, పైన శాలువా ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాహుల్ వేద పాఠశాల విద్యార్థులను కలిసి వారితో కాసేపు ఇంటేరాక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

వీడియో
Scroll to load tweet…
