ఈసారి తిరుపతిలో...
- మొదటి సంవత్సరం కర్నూలులో
- ఆ తర్వాతి ఏడాది విశాఖపట్నంలో
- ఈ సారి ఈ అవకాశం తిరుపతికి దక్కనుంది
సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రతి రాష్ట్రంలో రాజధానిలో మాత్రమే జరుగుతుంటాయి. కానీ.. ఏపీలో మాత్రంలో వినూత్నంగా జిల్లాల్లో నిర్వహిస్తూవస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిరుపతిలో నిర్వహించ తలపెట్టింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రాంతంలో ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది. మొదటి సంవత్సరం కర్నూలులో నిర్వహించారు. ఆ తర్వాతి ఏడాది విశాఖపట్నంలో, గతేడాది అనంతపురంలో నిర్వహించారు. అదేవిధంగా ఈ ఏడాది తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు మువ్వన్నల జెండాను ఎగురవేయనున్నారు.
ఇలా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా స్థానిక ప్రజలంతా వీక్షించే అవకాశం కలుగుతుంది. ఈ సారి ఈ అవకాశం తిరుపతికి దక్కనుంది.
కాగా తిరుపతిలో ఎక్కడ నిర్వహిస్తారనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. భద్రతా సిబ్బంది ఇప్పటి నుంచి భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే తిరుపతిలోని ఎస్ యూవీ గ్రౌండ్స్ లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం