Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడు శశికళ కు మరో ఝలక్

  • శశికళ భర్త నటరాజన్ ను దోషిగా తేల్చిన మద్రాస్ హైకోర్ట్
  • రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు
another shock to shashikala

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే సీఎం పదవిని ఆశించి భంగపడి, అక్రమాస్తులు కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు మరో షాక్ తగిలింది. ఆమె భర్త నటరాజన్ ను ఓ కేసులో దోషిగా తేలుస్తూ మద్రాస్ హైకోర్టులో తీర్పు వెలువరించింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే శశికళ భర్త నటరాజన్  ఓ ఖరీదైన కారును విదేశాల్లోంచి తెప్పించే క్రమంలో సుంకాన్ని ఎగ్గొట్టి చిక్కులో ఇరుకున్నాడు. అతడు 1994లో లెక్సస్ కంపెనీకి చెందిని ఓ ఖరీదైన కారును ఆర్డర్ చేసి బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఈ కారును తన ప్రెండ్ మరియు బందువైన బాస్కరన్ కు బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ కారుకు సంభందించిన సుంకాన్ని ఎగ్గొట్టడానికి ఆ కారును ఇంతకు ముందే వాడిన కారుగా చూపించారు. ఈ విధంగా కొత్తకారు దిగుమతికి చెల్లించాల్సిన సుంకం రూ.1.16 కోట్ల ను ఎగ్గొట్టారు. దీనిపై కేసు నమోదు కాగా 23 ఏళ్లుగా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. తుదకు మద్రాస్ హైకోర్టు తుదితీర్పు వెలువరిస్తూ అతడికి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios