పది గ్రాముల బంగారం ధర రూ.29,300 కేజీ వెండి ధర రూ.39,150

బంగారం ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. రూ.150 తగ్గి.. పది గ్రాముల బంగారం ధర రూ.29,300కి చేరింది. స్తానిక వ్యాపారుల వద్ద నుంచి బంగారం కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 0.08శాతం తగ్గి 1,257.60కి చేరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈరోజు వెండి ధర కూడా తగ్గింది. రూ.225 తగ్గి కేజీ వెండి ధర రూ.39,150కి చేరింది. నాణేల కొనుగోళ్లు మందగించడం కారణంగా వెండి విలువ తగ్గింది. దేశ రాజధానిలో 99.9శాతం స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.29,300గానూ, 99.5 స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.29,150గానూ ఉంది.